Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్!
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
- Author : Gopichand
Date : 07-05-2025 - 7:22 IST
Published By : Hashtagu Telugu Desk
Narendra Modi Stadium: భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి జవాబు ఇచ్చింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ ఉగ్రవాదులను హతమార్చి, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడి తర్వాత భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ నరేంద్ర మోదీ స్టేడియంను (Narendra Modi Stadium) బాంబుతో పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది.
నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు
భారత క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద టోర్నమెంట్లలో ఒకటైన IPL 2025 ప్రస్తుతం జరుగుతోంది. IPLలోని అనేక మ్యాచ్లు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ల మధ్య గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA)కి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో నరేంద్ర మోదీ స్టేడియంను బాంబుతో పేల్చివేస్తామని బెదిరించారు. మెయిల్లో ఇలా రాసి ఉంది. మేము మీ స్టేడియంను పేల్చివేస్తామని ఈ ఇ-మెయిల్ పాకిస్తాన్ పేరుతో GCAకి వచ్చింది.
Also Read:Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలమెంత? పాక్ కంటే ఎక్కువా.. తక్కువా?
భద్రతా సంస్థల దర్యాప్తు ప్రారంభం
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్కు ఈ మెయిల్ రాగానే భద్రతా సంస్థలు అప్రమత్తమై, ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఈ బెదిరింపు భారత సైన్యం పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ దాడి చేసిన తర్వాత వచ్చింది. రాబోయే రోజుల్లో IPLలో రెండు కీలక మ్యాచ్లు ఈ స్టేడియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో స్టేడియం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తనిఖీలు మొదలయ్యాయి.
స్టేడియం వివరాలు, IPL మ్యాచ్లు
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
ఈ బెదిరింపు నేపథ్యంలో స్టేడియం భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అహ్మదాబాద్ పోలీసులు, బాంబ్ నిర్వీర్య బృందాలు చర్యలు చేపట్టాయి. 2023లో కూడా నరేంద్ర మోదీ స్టేడియంకు ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చినప్పుడు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే, ఈ బెదిరింపు నిజమా లేక కేవలం ఫేక్గా పరిగణించాలా అనేది దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతుంది.