Mohammad Nabi: క్రికెట్కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ఈ నిర్ణయం గురించి నబీ తనకు తెలియజేసినట్లు వెల్లడించారు. నబీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది.
- Author : Gopichand
Date : 08-11-2024 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
Mohammad Nabi: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి వేదిక మొత్తం కూడా సిద్ధమైంది. మరోవైపు అఫ్గానిస్థాన్ వెటరన్ ప్లేయర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మహ్మద్ నబీ ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ODI క్రికెట్ నుండి రిటైర్ (Mohammad Nabi) కానున్నాడు. ఈ బలమైన ఆల్రౌండర్ గత 15 ఏళ్లుగా వన్డే ఫార్మాట్లో తన దేశం కోసం ఆడుతున్నాడు. ఇప్పుడు అతను వచ్చే ఏడాది తన వన్డే కెరీర్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ ఈ నిర్ణయం గురించి నబీ తనకు తెలియజేసినట్లు వెల్లడించారు. నబీ నిర్ణయాన్ని నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు పేర్కొంది. నబీ ఆఫ్ఘనిస్తాన్ తరపున T20 క్రికెట్ ఆడటం కొనసాగిస్తాడు. 2019లో సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత 2026 T20 ప్రపంచ కప్ను లక్ష్యంగా చేసుకున్నాడు.
Also Read: Nani Srikanth Odela 2 : నాని శ్రీకాంత్ ఓదెల 2.. ఇంట్రెస్టింగ్ గా మరో టైటిల్..!
నసీబ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. “అవును ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నబీ ODIల నుండి రిటైర్ అవుతున్నాడు. అతను తన కోరికను బోర్డుకి తెలియజేసాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను తన T20 కెరీర్ను కొనసాగించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి అదే నబీ ప్రణాళిక అని తెలిపారు. ఈ ఆల్రౌండర్కు అత్యధిక సంఖ్యలో జట్లపై విజయాలు సాధించిన రికార్డు కూడా ఉంది. ఆఫ్ఘనిస్థాన్ తరఫున 45 మ్యాచ్ల విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో నబీ ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యధిక ఇన్నింగ్స్లో 79 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
నబీ వన్డే కెరీర్ ఇలాగే సాగింది
మహ్మద్ నబీ ఆఫ్ఘనిస్థాన్ తరఫున 165 వన్డే మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో 3537 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 2 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా బౌలింగ్లో నబీ 171 వికెట్లు తీశాడు.