HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Icc Ceo Confirms Pakistan As The Host For The Champions Trophy 2025

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుందా..? లేదా? ఐసీసీ స‌మాధానం ఇదే..!

ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డైస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని మార్చే ఆలోచన లేదని అన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇప్పటివరకు ఏ జట్టు కూడా విముఖత చూపలేదు.

  • By Gopichand Published Date - 02:29 PM, Sat - 14 September 24
  • daily-hunt
Champions Trophy 2025
Champions Trophy 2025

Champions Trophy 2025: ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనే విష‌యంపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతా కారణాల దృష్ట్యా టీమ్ ఇండియా చాలా కాలంగా పాకిస్థాన్‌లో పర్యటించడం లేదు. అయితే ఈ కాలంలో టీమిండియా పాకిస్తాన్‌లో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను వేరే దేశంలో హైబ్రిడ్ మోడల్‌లో ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఆతిథ్యం ఇవ్వగలరా లేదా..? హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి ఐసీసీ సీఈవో స్వయంగా సమాధానం ఇచ్చారు.

ఐసీసీ సీఈవో ఏం చెప్పారు?

ఈ విషయంపై ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డైస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని మార్చే ఆలోచన లేదని అన్నారు. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇప్పటివరకు ఏ జట్టు కూడా విముఖత చూపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టోర్నీని పాకిస్థాన్‌ నుంచి మార్చడం సబబు కాదని ఆయ‌న అన్నారు.

Also Read: Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ

భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళుతుందా లేదా అనే దానిపై ఇప్పటివరకు బీసీసీఐ లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ టోర్నీలో టీమ్ ఇండియా హైబ్రిడ్ మోడల్‌లో మాత్రమే పాల్గొంటుందని విశ్వసిస్తున్నప్పటికీ.. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు.

ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా పాక్‌లో పర్యటిస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విశ్వసిస్తోంది. భారత క్రికెట్ జట్టు మినహా ఈ టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తమ దేశానికి వ‌చ్చి వెళ్లాయ‌ని పీసీబీ చెబుతోంది. ఈ టోర్నీలో ఆడేందుకు భారత్ రాకపోవడానికి బలమైన కారణం లేకపోలేదు.

8 జట్లు పాల్గొంటాయి

ఈ టోర్నీలో భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్లు పాల్గొంటాయి. ఫిబ్రవరి-మార్చి 2025లో ప్రతిపాదించబడిన ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు కరాచీ, రావల్పిండి, లాహోర్‌లలో జరుగుతాయి. భారత జట్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వ‌హించ‌నున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champions Trophy
  • ICC
  • ICC Champions Trophy 2025
  • india
  • pakistan
  • PCB

Related News

America

America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్‌ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd