Domestic Cricketers: దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్ల జీతం పెంపు..? బీసీసీఐ నుంచి త్వరలోనే ఆమోదం..!
ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది.
- By Gopichand Published Date - 01:41 PM, Sun - 24 March 24
Domestic Cricketers: ఇటీవల బీసీసీఐ టెస్టు క్రికెటర్ల వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారత క్రికెటర్లు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు రూ.15 లక్షలు అందుకోనున్నారు. అదే సమయంలో ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడే క్రికెటర్లకు (Domestic Cricketers) శుభవార్త రానుంది. నిజానికి రంజీ ట్రోఫీ క్రికెటర్ల జీతాన్ని పెంచే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై పెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. BCCI రెడ్ బాల్ క్రికెట్ను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రంజీ ట్రోఫీ క్రికెటర్ల డబ్బును పెంచే నిర్ణయానికి త్వరలో ఆమోదం లభించవచ్చు.
రంజీ ట్రోఫీ క్రికెటర్లకు ఎంత డబ్బు వస్తుంది?
ప్రస్తుతం బీసీసీఐ రంజీ ట్రోఫీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజుగా రోజుకు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తోంది. అయితే, ఇదంతా సీజన్లో ఆడిన మ్యాచ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఆటగాడు ఒక సీజన్లో మొత్తం ఏడు గ్రూప్ గేమ్లు ఆడితే, అతను సంవత్సరానికి దాదాపు రూ. 11.2 లక్షలు పొందుతాడు. నిజానికి IPL కారణంగా చాలా మంది పెద్ద ఆటగాళ్లు రంజీ ట్రోఫీని ఆడకుండా తప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు BCCI తన కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.
Also Read: Mamitha Baiju : హిట్టు పడింది రెమ్యునరేషన్ డబుల్ చేసింది.. వారెవా..!
రంజీ ట్రోఫీలో ఆడేందుకు క్రికెటర్లు ఇష్టపడరా..!
ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం.. 156 మంది భారతీయ క్రికెటర్లు IPL 2024 కోసం సంతకం చేశారు. ఇందులో రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 56 మంది ఆటగాళ్లు ఉన్నారు. కాగా 25 మంది ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. అయితే ఇప్పుడు ఈ సమస్యలన్నింటిని ఎదుర్కోవడానికి బీసీసీఐ భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీనిపై పెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే రంజీ ట్రోఫీ క్రికెటర్ల సొమ్మును పెంచే నిర్ణయానికి ఆమోదం లభిస్తే ఆటగాళ్లపై ఎంతమేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీని తర్వాత ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్కే పెద్దపీట వేస్తారా? లేదా అనేది తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join
Related News
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.