Good News To India Team: టీమిండియాకు డబుల్ గుడ్ న్యూస్.. ఆసీస్కు రోహిత్తో పాటు స్టార్ బౌలర్?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని ఓ ప్రముఖ జాతీయ మీడియా తన నివేదికలో పేర్కొంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
- By Gopichand Published Date - 08:29 PM, Sat - 16 November 24

Good News To India Team: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నవంబర్ 22న డబ్ల్యూఏసీఏ మైదానంలో జరగనుంది. యావత్ ప్రపంచం దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. టీమ్ ఇండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఈ సిరీస్ను 4-1తో కైవసం చేసుకుని ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఫైనల్లో చోటు దక్కించుకోవాలని టీమిండియా ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో పెర్త్ టెస్టు మ్యాచ్కి ముందు టీమిండియాకు (Good News To India Team) శుభవార్త వచ్చింది.
టీమ్ ఇండియాకు శుభవార్త
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీ ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చని ఓ ప్రముఖ జాతీయ మీడియా తన నివేదికలో పేర్కొంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే షమీని జట్టులోకి తీసుకునే విషయం రంజీ టెస్ట్ మ్యాచ్ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం పెర్త్ టెస్టు మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ జట్టులో చేరవచ్చు. అతనితో పాటు మహ్మద్ షమీ కూడా ఆస్ట్రేలియా వెళ్లవచ్చని సారాంశం. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్లలేదు. జట్టులోని ఇతర సభ్యులు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. పెర్త్ టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడటంపై కూడా అనుమానాలు ఉన్నాయి.
రంజీల్లో షమీ అద్భుత ప్రదర్శన
మహ్మద్ షమీ దాదాపు ఏడాది పాటు టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఇటీవల అతను బెంగాల్- మధ్యప్రదేశ్ మ్యాచ్లో ఆడటం కనిపించింది. ఈ సమయంలో అతను అద్భుత ప్రదర్శన చేసి 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా రెండో ఇన్నింగ్స్లో 24.2 ఓవర్లలో 102 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియాకు భారత జట్టు
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.