HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ahmedabad Pitch Report Kya Hai

Ahmedabad Pitch: అహ్మదాబాద్‌ పిచ్‌ రిపోర్ట్ క్యా హై?

నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ

  • Author : Maheswara Rao Nadella Date : 06-03-2023 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ahmedabad Pitch
Ahmedabad Pitch Report Kya Hai

నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ ప్రత్యర్థి జట్టు మాజీలు, మీడియా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్‌ కూడా 3 రోజుల్లోపే ముగుస్తుందా.. అహ్మదాబాద్ పిచ్ (Ahmedabad Pitch) ఎలా ఉండబోతోంది…ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. నిజానికి క్రికెట్‌లో పిచ్‌లు ఆతిథ్య దేశానికి అనుకూలంగా తయారు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్..ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయా ఆతిథ్య దేశాలకు అనుకూలించే పిచ్‌లే ఉంటాయి. సొంత పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను నిలువరించడం కామనే.. ఇలాంటి పిచ్‌లపై ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ గెలిస్తే గొప్ప ఘనతే. అయితే భారత్‌కు వచ్చేటప్పటికి మాత్రం పిచ్‌ల విషయంలో విదేశీ జట్లు విమర్శలు గుప్పిస్తుంటాయి. నిజానికి ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు ఫేవర్‌గా ఉండడం సహజమే. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్ల ఆధపత్యమే కనిపిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టులూ 3 రోజుల లోపే ముగిసిపోయాయి.

నాగ్‌పూర్‌ పిచ్‌ను చూస్తే బంతి బాగా టర్న్ అయింది. ఈ పిచ్‌పై మన బ్యాటర్లు రాణించినా.. ఆసీస్ బ్యాటర్లు మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా ఇన్నింగ్స్ 132 రన్స్ తేడాతో గెలిచింది. తర్వాత ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి.. అయితే ఈ సారి ఆసీస్‌ స్పిన్నర్లు కూడా రాణించారు. భారత బ్యాటర్లు కొంత తడబడినా.. చివరికి మనదే పైచేయిగా నిలిచింది. దీంతో ఆధిక్యం 2-0కు పెరిగిన వేళ.. మరోసారి పిచ్‌పై ఆసీస్ మాజీలు, మీడియా విమర్శలు గుప్పించాయి. దీనికి కెప్టెన్ రోహిత్‌శర్మ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఆటగాళ్ళ సత్తా చూడాలని, పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇండోర్‌లో మాత్రం భారత్ వ్యూహం బెడిసికొట్టింది. మరోసారి స్పిన్ పిచ్‌తోనే ఆసీస్‌ను దెబ్బతీయాలనుకున్న టీమిండియా తానే ఈ వ్యూహంలో చిక్కుకుని చిత్తుగా ఓడింది. గెలిచిన తర్వాత ఆసీస్ పిచ్‌లపై ఎలాంటి విమర్శలు చేయలేదు.

ఓవరాల్‌గా మూడు టెస్టులూ 3 రోజుల్లోనే ముగియడం మాత్రం మాజీ ఆటగాళ్ళను నిరాశకు గురి చేసాయి. కొందరు పిచ్‌లను సమర్థిస్తే.. మరికొందరు మాత్రం ఐదు రోజుల్లో ఫలితం వచ్చేలా రూపొందించాలని సూచించారు. కాగా ఇప్పుడు అందరి దృష్టీ అహ్మదాబాద్ పిచ్‌ (Ahmedabad Pitch) పై పడింది. మొదటి మూడు టెస్టులూ సగం రోజులకే ముగిసిపోవడంతో చివరి టెస్టు ఎన్ని రోజులు జరుగుతుందన్న చర్చ మొదలైంది. అయితే పిచ్ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి సూచనలూ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో సాధారణంగా ఇక్కడ తయారు చేసే పిచ్‌నే క్యూరేటర్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన రంజీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్ ఐదు రోజుల పాటు జరిగే అవకాశముంది.

Also Read:  Oatmeal Water: ఓట్ మీల్ వాటర్ ను ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగితే వచ్చే ఆర్యోగ్య ప్రయోజనాలు ఇవే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • BCCI
  • cricket
  • ICC
  • india
  • Pitch
  • report
  • sports

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Rohit Sharma breaks silence on retirement: 'I am not leaving...'

    Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

  • BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

    Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd