HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Stones Pelted At Dehradun Delhi Vande Bharat Express

Vande Bharat Express: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది.

  • Author : Gopichand Date : 19-06-2023 - 7:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Vande Bharat Exp

Vande Bharat Express: వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది. మీరట్-ముజఫర్‌నగర్ రైల్వే ట్రాక్‌లోని జరౌడ నర రైల్వే స్టేషన్ గుండా వెళుతుండగా రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో రైలు విండ్‌షీల్డ్‌లపై గీతలు పడ్డాయి. రైలులో ఉన్న కొందరు ప్రయాణికులు దీనిని వీడియో తీశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ E1 కోచ్‌పై రాళ్ల దాడి జరిగిందని ANI తెలిపింది. రాళ్ల దాడిలో ఎవరూ గాయపడలేదు. నిందితుడిని పట్టుకునేందుకు ఢిల్లీలోని ఆర్పీఎఫ్ బృందం పనిచేస్తోందని రైల్వే శాఖ తెలిపింది. అయితే రాళ్ల దాడి ఘటనను జరౌడ నర రైల్వే స్టేషన్ మాస్టర్ కొట్టిపారేస్తున్నారు.

మే 29న రైలు ప్రారంభమైంది

మే 29న ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ వరకు నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

Also Read: Goods Train Derailed : ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్‌ రైలు.. విశాఖ – కిరండోల్ ఎక్స్‌ప్రెస్ ర‌ద్దు

ఆనంద్ విహార్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఏడు రోజుల వ్యవధిలోనే మరోసారి రాళ్లు రువ్వారు. ముజఫర్‌నగర్‌ స్టేషన్‌ సమీపంలో రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం లేదు. రాళ్లదాడి చేసిన వారిని పట్టుకునేందుకు రైల్వే ఆర్పీఎఫ్‌కు అధికారులు సమాచారం అందించారు. రైల్వే శాఖ ప్రకారం.. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ముజఫర్‌నగర్ స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ E1 కోచ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ డివిజన్ ఆర్పీఎఫ్‌ను మోహరించింది.

జూన్ 12న రాళ్ల దాడి

అంతకుముందు.. జూన్ 12న రైలుపై రాళ్ల దాడి జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గత సోమవారం (జూన్ 12) సాయంత్రం ఆనంద్ విహార్ నుండి డెహ్రాడూన్ వెళ్తోంది. సహరాన్‌పూర్ చేరుకోకముందే తాప్రి-సహారన్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనతో రైలు కొంతసేపు నిలిచిపోయింది. పలుచోట్ల రైలు చైర్‌కార్‌ కోచ్‌ అద్దాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రైలును సహరాన్‌పూర్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి నుంచి రైలు డెహ్రాడూన్‌కు చేరుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dehradun
  • delhi
  • Stones Pelted
  • Vande Bharat
  • Vande Bharat Express

Related News

Delhi Alert

Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!

ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Latest News

  • Rape : బాలికను అత్యాచారం చేసిన జ్యోతిషుడు

  • Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

  • YouTuber Komali : తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య..కారణం అదేనా ?

  • Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

  • Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd