Speed News
-
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు. సంక్రాంతి వేళ అంబులెన్స్కు దారి కల్పించిన వైనం మహిళా కానిస్టేబుల్
Date : 22-01-2026 - 2:55 IST -
కర్ణాటక అసెంబ్లీలో కలకలం.. సభ మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్
కర్ణాటక అసెంబ్లీలో వివాదం చెలరేగింది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన ప్రసంగాన్ని రెండు మాటలతోనే ముగించి సభలో నుంచి వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గెహ్లాట్ చదవలేదు. దీంతో గవర్నర్ గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతుండగా.. బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ సరైన నిర్ణయం తీసుకు
Date : 22-01-2026 - 1:32 IST -
ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
Vijayasai Reddy Attends To ED Investigation ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయస
Date : 22-01-2026 - 12:35 IST -
తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ కాగా, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
Date : 21-01-2026 - 11:04 IST -
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కన్నుమూత.. కెరీర్లో 2548 వికెట్లు!
గిఫోర్డ్ 1964- 1965లో వోర్సెస్టర్షైర్ కౌంటీ ఛాంపియన్షిప్ గెలిచిన జట్లలో కీలక సభ్యుడిగా ఉన్నారు. 1960 నుండి 1988 మధ్య ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఒక బౌలర్గా ఆయన గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి.
Date : 21-01-2026 - 6:59 IST -
పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Announces Padayatra మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రపై జగన్ కీలక ప్రకటన చేశారు. బుధవారం రోజున ఏలూరు నియోజకవర్గం నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర ఎప్పటి నుంచి చేపడతాననే దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఏడాదిన్నర రోజులు ప్రజల్లో ఉంటానని తెలిపారు. ఇకపై ప్రతి
Date : 21-01-2026 - 5:09 IST -
బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చ
Date : 21-01-2026 - 3:39 IST -
నేను జగన్ మనిషినా.. దమ్ముంటే చర్చకు సిద్ధం .. ఏబీ వెంకటేశ్వరరావుకు బొలిశెట్టి ఓపెన్ ఛాలెంజ్
Bolisetty Satyanarayana VSRetired IPS Officer AB Venkateswara Rao రాజధాని అమరావతి విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం.. దీనికి కారణమైంది. ఈ కేసుల కారణంగానే అమరావతి నిర్మాణంలో జాప్యం జరిగిందని ఏబీవీ అన్నారు. అయితే ఏబీవ
Date : 21-01-2026 - 3:24 IST -
అసెంబ్లీకి రాకపోతే నో పే అయ్యన్నపాత్రుడు షాకింగ్ డెసిషన్
Ayyanna Patrudu వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యల
Date : 21-01-2026 - 3:10 IST -
మరోసారి భూముల విలువ పెంచిన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద
Date : 21-01-2026 - 12:35 IST -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి
Date : 21-01-2026 - 12:13 IST -
శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం
Srisailam Dam ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్పూల్ మరమ్మతుకు మోక్షం లభించింది. మరమ్మతు పనులకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ).. సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ప్లంజ్పూల్ మరమ్మతులపై అధ్యయనం చేసి.. డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సిఫార్సులు చేయనుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంధ్రప్ర
Date : 21-01-2026 - 11:42 IST -
3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు
సాధారణంగా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్గా మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు, ఈసారి మూడు నెలల ముందుగానే జనవరిలోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల విక్రయ కేంద్రాల్లో 'బంగినపల్లి' రకం మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి
Date : 20-01-2026 - 3:00 IST -
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత
Date : 20-01-2026 - 12:43 IST -
సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్ఐబీ మాజీ చీ
Date : 20-01-2026 - 11:06 IST -
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది అంటూ హరీశ్ రావు ఫైర్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే "ద్రోహ బుద్ధి" ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా అవినీతి మరియు ప్రజాద్రోహంతో కూడుకున్నదని తీవ్రంగా విమర్శించారు
Date : 18-01-2026 - 9:45 IST -
భారత్ ఘోర పరాజయం.. తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్!
ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్లో పర్యటించి టీమ్ ఇండియాపై ఒక వన్డే సిరీస్ను న్యూజిలాండ్ గెలవడం ఇదే తొలిసారి.
Date : 18-01-2026 - 9:43 IST -
మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ ఫైర్!
బెంగాల్ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్ర విద్యను మాఫియా, అవినీతిపరులు చుట్టుముట్టారని పీఎం మోదీ అన్నారు.
Date : 18-01-2026 - 7:58 IST -
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు
ED Notice To EX MP VIjay Sai Reddy మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జనవరి 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 2019-2024 మధ్య మద్యం విధానంలో భారీగా లంచాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించగా, తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు రావడం కలకలం రేపుతోంది. మాజీ
Date : 17-01-2026 - 12:19 IST