Speed News
-
CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
కర్ణాటక రాజకీయాల్లో షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక ఈ రోజు సాయంత్రం 6గంటలకు రాష్ట్ర కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామయ్య నుంచి అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్భవన్లో జరగనున్న ఈ క
Date : 03-06-2026 - 8:10 IST -
Fraud :సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం
తక్కువ డబ్బులకు అధిక రాబడులు వస్తాయని నమ్మించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ పట్టణంలోని శ్రీరంగపురం గ్రామంలో జరిగింది. తమను దాదాపు రూ. 11 కోట్లు మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో శ్రీరంగపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అధిక వడ్డీ రేట్లు, అస
Date : 03-06-2026 - 7:19 IST -
Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 7గురు మృతి
గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందగా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్ట
Date : 03-06-2026 - 7:09 IST -
AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప
Date : 03-06-2026 - 6:59 IST -
TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
పనిచేయకపోతే మొహమాటం లేకుండా పక్కనపెట్టేస్తామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్షాప్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మరోసారి అప్రమత్తం చేశారు. పనిచేసినంత కాలం పదవులకు ఇబ్బంది లేదని.. పనిచేయకపోతే పక
Date : 02-06-2026 - 5:01 IST -
Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా
తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన అన్నామలై మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నే
Date : 02-06-2026 - 3:46 IST -
Donald Trump Tariff: భారత్పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో శుభవార్త చెప్పారు. కొన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలపైన దిగుమతి సుంకాలను 10 శాతం వరకు తగ్గించారు. అంతకుముందు 25 శాతంగా ఉండగా, దీనిని 15 శాతానికి తగ్గించారు. అయితే ఇది తాత్కాలిక తగ్గింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది 2027 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. ఒకవైపు అమెరికా-ఇరాన్
Date : 02-06-2026 - 2:50 IST -
AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా, నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసింది. పాఠశాల విద్యాశాఖ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు, క్రీడాకారుల కోసం అమల్లో ఉన్న 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కింద మొత్తం 421 ఉప
Date : 02-06-2026 - 1:16 IST -
YSRCP : కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో ఎక్కువగా నష్టపోయింది మహిళలే – సజ్జల
రెండేళ్ల చంద్రబాబు కూటమి పాలనలో ఎక్కువగా నష్టపోయింది మహిళలేనని ఆరోపించారు వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. దగా, మోసం, వెన్నుపోటుకి పరాకాష్టగా ఈ రెండేళ్ల కూటమి పాలన నిలిచిపోతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పేరుతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్
Date : 02-06-2026 - 1:04 IST -
Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం Nandu’ s world సంచలనం
Nandu’s World Nandana నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన భార్యాభర్తలపై కొద్దిరోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. యూకే వీసా పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా ఈ జంట టార్గెట్గా పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై నందూస్ వరల్డ్ నందన స్పందించారు.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ‘నందూస్ వరల్డ్’ (Nandus World) పేరుతో యూకేలో ఉంటున్న భ
Date : 02-06-2026 - 12:55 IST -
ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు
ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై వేదాంత గ్రూప్కు చెందిన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ సోదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కంపెనీలో లావాదేవీలు ఫెమా నిబంధనలకు అనుగుణంగా జరిగాయా లేదా అనే అంశాన్ని ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల సందర్భంగా సంబంధిత ఆర్థిక పత్రాలు, ఒప్పందాలు, లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని ప
Date : 02-06-2026 - 12:35 IST -
Minior Girl : హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య
హైదరాబాద్లో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన కలకలం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోందని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా
Date : 02-06-2026 - 11:36 IST -
US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం
అమెరికాలో అక్రమంగా నివసిస్తూ వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. వీరిని త్వరలో స్వదేశాలకు బహిష్కరించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) విడుదల చేసిన వివరాల ప్రకారం.. మే 11 నుంచి 15 వరకు అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్లో నిర్వహించ
Date : 02-06-2026 - 11:20 IST -
Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే ఈ రుతుపవనాలు, ఈసారి కొన్ని రోజులు ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. అయితే, రాబోయే రెండు మూడు రోజుల్లో రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ప్రకటించింది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని
Date : 02-06-2026 - 10:45 IST -
Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్ మంత్రి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇళ్లలో పనిచేసి నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న కలిత మాఝీ, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చార
Date : 02-06-2026 - 10:16 IST -
Mamata Banerjee: మమతా బెనర్జీ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్కు (టీఎంసీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశం అనూహ్యంగా రద్దయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు గాను 20 మంది మాత్రమే హాజరుకావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీప
Date : 02-06-2026 - 10:08 IST -
Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జూన్ 15వ తేదీలోగా ఆయన తన కొత్త పార్టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Date : 02-06-2026 - 9:21 IST -
CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పె
Date : 02-06-2026 - 8:58 IST -
BRS : బాల్కా సుమన్కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు
సింగరేణి సంస్థలకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్కు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన పలు అభియోగాలను నాంపల్లి కోర్టు కొట్టివేస్తూ.. రెండు సెక్షన్ల కింద మాత్రమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి) మాత్రమే ఈ కేసుకు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPP Act)తో పాటు పోలీసు
Date : 02-06-2026 - 8:33 IST -
HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నగరంలోని బెల్టుషాపులపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఉక్కుపాదం మోపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఆయప దాడులు నిర్వహించారు. స్థానిక మహిళలు, కాలనీ వాసుల ఫిర్యాదుల మేరకు అర్థరాత్రి స్వయంగా అక్కడికి వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకులను పట్టించి పోలీసులకు అప్పగించారు. గోకుల్ ప్లాట్స్ కాలనీలో విచ్చలవిడిగా బె
Date : 02-06-2026 - 8:02 IST