DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత!
మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సులేటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది.
- Author : Kode Mohan Sai
Date : 23-05-2025 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
DK Aruna: మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సులేటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పదవితో డీకే అరుణ రాష్ట్రంలో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ, మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) అమలులో కీలక పాత్ర పోషించనున్నారు. కమిటీ ద్వారా రైతులు మరియు వినియోగదారుల హితాలు రక్షించబడతాయి. అలాగే, ధాన్యాల నాణ్యత, నిల్వ సామర్థ్యం, రవాణా వంటి అంశాలపై సమీక్షలు చేసి సలహాలు అందించనున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్ గా నన్ను ఎంపిక చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఈ కమిటీ ద్వారా తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై అధ్యయనం చేయడంలో, పరిష్కార మార్గాలు చూపడంలో… pic.twitter.com/Z6Hiwtzt6X
— D K Aruna (@Aruna_DK) May 23, 2025
ఈ నూతన బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. “రైతులు, పేదల సంక్షేమం కోసం పని చేయడం నా లక్ష్యం. ఈ పదవితో తెలంగాణలో ఆహార భద్రతను మెరుగుపర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను” అని ఆమె అన్నారు.
ఈ నియామకాన్ని గద్వాల పట్టణంలో ఆమె అభిమానులు, బీజేపీ కార్యకర్తలు హర్షాతిరేకాలతో స్వాగతించారు. డీకే అరుణ నేతృత్వంలో రాష్ట్రంలో ఆహార ధాన్యాల నిర్వహణ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.