Telangana Politics
-
#Telangana
బెయిల్పై విడుదలైన బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్లో ఉన్న ఆయన, ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్పై రెండు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో జిల్లా సెషన్స్ కోర్టు […]
Date : 04-03-2026 - 9:38 IST -
#Telangana
రాహుల్ గాంధీని నిలదీసిన కల్వకుంట్ల కవిత
Kavitha Vs Rahul Gandhi తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. “రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు […]
Date : 02-03-2026 - 10:55 IST -
#Telangana
తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ
ముఖ్యంగా తెలంగాణలో ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేర్లతో కొన్ని సంఘాలు పని చేస్తున్నట్టు తెలిసిందని అయితే వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.
Date : 23-02-2026 - 5:26 IST -
#News
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!
Errabelli Dayakar Rao తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు. ఛైర్మన్ […]
Date : 17-02-2026 - 4:42 IST -
#Telangana
కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ
Karimnagar Mayor పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ […]
Date : 16-02-2026 - 2:10 IST -
#Telangana
జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ… భవిష్యత్తులో తాము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామనే విషయాన్ని ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. తమ పార్టీని అధికారికంగా ప్రకటించక ముందే… మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని చివరి నిమిషంలో తమ కార్యకర్తలు కోరారని… వారి కోరిక మేరకు […]
Date : 14-02-2026 - 2:54 IST -
#Telangana
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !
Janasena Party తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. […]
Date : 13-02-2026 - 1:07 IST -
#Telangana
నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం
Telangana Municipal Election Results ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.ఏకపక్షంగా నందికొండ, హాలియా ఫలితాలు..నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా […]
Date : 13-02-2026 - 11:23 IST -
#Speed News
మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు
TDP candidate Bodepudi Revathi wins in Madhira తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 […]
Date : 13-02-2026 - 11:12 IST -
#Telangana
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
Telangana Municipal Election Results తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తెలియనుంది. అయితే, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల నుంచి 10,179 మంది, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్ల […]
Date : 13-02-2026 - 9:00 IST -
#Telangana
Telangana Politics : కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చే రేవంత్, హరీష్ రావు కు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ?
ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో హరీష్ రావు విసిరిన సవాల్ చర్చనీయాంశమైంది. తమ ఇలాకాలోకి అడుగుపెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని, అక్కడ హరీష్ రావు బలంగా ఉండటమే అందుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు.
Date : 10-02-2026 - 1:45 IST -
#Telangana
సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ ఎదురుచూపులకు […]
Date : 27-01-2026 - 1:02 IST -
#Telangana
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టు సమాచారం సిట్ విచారణకు హాజరైన కేటీఆర్, రాధాకిషన్ రావు […]
Date : 23-01-2026 - 3:53 IST -
#Speed News
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న […]
Date : 23-01-2026 - 11:56 IST -
#Speed News
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం […]
Date : 22-01-2026 - 4:46 IST