Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో డీసీఎంను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను నాగర్కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
- Author : Gopi
Date : 10-02-2023 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో డీసీఎంను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను నాగర్కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన కేశవులు (35), శ్రీనివాసులు (30), యాదయ్య (34), రామస్వామి (32)లుగా గుర్తించారు.
Also Read: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. ఏడుగురు చిన్నారులు దుర్మరణం
వీరంతా హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి నాగర్కర్నూల్ వెళ్తుంటే మహేశ్వరం మండలం తుమ్మనూరు గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.