Andhra Pradesh: విశాఖపట్నంలో విషాదం.. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.విశాఖ మర్రిపాలెం ప్రకాష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో సంధ్య అనే మహిళ నివాసం ఉంటున్నది.
- By Praveen Aluthuru Published Date - 03:22 PM, Wed - 9 August 23
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.విశాఖ మర్రిపాలెం ప్రకాష్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో సంధ్య అనే మహిళ నివాసం ఉంటున్నది. ఆమెకు 9 ఏళ్ళ గౌతమ్, ఐదేళ్ల అలేఖ్య ఉన్నారు. అయితే గత అర్ధరాత్రి ఆమె తన పిల్లల్ని తీసుకుని ముందుగా పిల్లల్ని సంపులోకి తోసేసింది. ఆ తరువాత ఆమె నీటి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మృతులు సదరు అపార్ట్మెంట్ లో పని చేస్తున్న వాచ్ మెన్ కుటుంబానికి దగ్గరి బంధువులే కావడం అనుమానాలకు దాసరి తీసింది. అయితే ఈ ఆత్మహత్య వెనుక కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు వాచ్మెన్ను విచారిస్తున్నారు.
Also Read: Mukesh Ambani: ఏకంగా అన్ని రూ. కోట్లకు లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముఖేష్ అంబానీ?
Related News
Murder in Chhattisgarh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య.. ఆపై నిందితుడు ఆత్మహత్య
ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి గొడ్డలితో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని చంపి, ఆపై ఉరి వేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం అని అంటున్నారు. సలీహా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.