Mukesh Ambani: ఏకంగా అన్ని రూ. కోట్లకు లగ్జరీ ఇల్లు అమ్మేసిన ముఖేష్ అంబానీ?
ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలి
- By Nakshatra Published Date - 03:16 PM, Wed - 9 August 23
ముఖేష్ అంబానీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖేష్ అంబానీ రిలయన్స్ డిజిటల్ సంస్థకి అధినేత అయిన విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు ముకేశ్ అంబానీ సుపరిచితమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులలో టాప్ ఫైవ్ లో ముఖేష్ అంబానీ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ముఖేష్ అంబానీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అన్నది ఆయనకే తెలియదు. ఆయన రోజు సంపాదన కోట్లల్లో ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతూ అంబానీ ఇద్దరు కూడా ప్రతిరోజు లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ముకేశ్ అంబానీ సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముకేశ్ కి చెందిన ఒక లగ్జరీ ప్రాపర్టీని అమ్మేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలోని మ్యాన్హట్టన్ వెస్ట్ విలేజ్లో ఒక విలాసవంతమైన ఇల్లును విక్రయించాడట. నాలుగో ఫ్లోర్లో 2406 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లగ్జరీ ఇంటిని 9 మిలియన్ డాలర్లకు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.74.5 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది.
కాగా ఈ ఇల్లు హడ్సన్ నదీ తీరాన ఉంది. ఇందులో రెండు బెడ్రూంల నుంచి ఈ నది చుట్టూ ప్రకృతి అందాలను చూసేందుకు అందంగా నిర్మించారు. లోపల కూడా అత్యాధునిక సౌకర్యాలతో దీని నిర్మాణం చేపట్టారు.
ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ను అత్యద్భుతంగా రూపొందించారు. పది అడుగుల ఎత్తులో సీలింగ్స్, హెరింగ్బోన్ హార్డ్వుడ్ ఫ్లోర్స్, బయటి శబ్ధాలు లోపలికి వినిపించకుండా నిరోధించే కిటికీలు వంటి లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి..ఇక అంబానీకి ముంబయిలో ఆంటిలియా అనే ఇల్లు కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన నివాసంగా పేరుగాంచింది. ఇక దీని విలువ రూ.15 వేల కోట్లకుపైనే ఉంటుంది. సుమారు 27 అంతస్తుల ఈ భవనంలో 60 ఫ్లోర్స్ ఉంటాయి. ఇందులోనే హెలిప్యాడ్, టెంపులు, సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ లో దాదాపు 600 మందికిపైగా సిబ్బంది పనిచేస్తుంటారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున నెలజీతం ఉంటుందని తెలుస్తోంది. ఇవి కాకుండా అంబానీకి ఇంకా అమెరికా, యూకే, దుబాయ్ వంటి దేశాల్లో కూడా విలాసవంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Related News
Chandrababu : చంద్రబాబు ఫారిన్ టూర్.. వారం పాటు అమెరికా పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.