HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pakistan To Release 200 Indian Fishermen Three Civilian Prisoners

Indian Fishermen: 200 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్

దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు.

  • By Gopichand Published Date - 07:34 AM, Sat - 3 June 23
  • daily-hunt
Indian Fishermen
Resizeimagesize (1280 X 720)

Indian Fishermen: దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ మత్స్యకారులు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన అనికేత్ అనే మత్స్యకారుడు మాట్లాడుతూ.. “నేను గుజరాత్ నివాసిని. రెండేళ్ల క్రితం చేపలు పట్టే సమయంలో నీటి ప్రవాహం కారణంగా సరిహద్దు దాటి వెళ్లాను. అక్కడ దాదాపు 265 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు” అని తెలిపాడు.

30 నెలల పాటు పాకిస్థాన్ జైల్లో ఉన్నానని మరో మత్స్యకారుడు ఉమర్ చెప్పారు. మేము చేపలు పట్టేటప్పుడు సరిహద్దు దాటి వెళ్ళాం. ఆ తర్వాత పాకిస్తాన్ పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ (పాకిస్థాన్) అక్రమంగా శిక్ష అనుభవిస్తున్న వారిని అక్కడి నుంచి వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపాడు.

Also Read: US Army: అమెరికాలో దారుణం.. యజమాని పైనే తిరగబడిన డ్రోన్.. చివరికి?

అంతకముందు.. మానవతా దృక్పథంతో పాకిస్థాన్ 200 మంది భారతీయ మత్స్యకారులను, మరో ముగ్గురు ఖైదీలను శుక్రవారం విడుదల చేయనుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. దేశ సముద్ర సరిహద్దులో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కరాచీ జైలులో ఉన్న 198 మంది భారతీయ జాలర్లను పాకిస్తాన్ అధికారులు గత నెలలో విడుదల చేశారు. ఈ ఖైదీలను వాఘా సరిహద్దులో భారత్‌కు అప్పగించారు. బిలావల్ ఒక ట్వీట్‌లో ఈ రోజు పాకిస్తాన్ 200 మంది భారతీయ మత్స్యకారులు, మరో ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తోంది. అంతకుముందు 198 మంది భారతీయ మత్స్యకారులను 2023 మే 12న భారత్ కి అప్పగించినట్లు పేర్కొన్నాడు. ఇది మానవీయ విషయాలను రాజకీయం చేయకూడదనే పాకిస్తాన్ విధానానికి అనుగుణంగా ఉంది. కరుణ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని పేర్కొన్నాడు.

కరాచీ నుంచి లాహోర్‌కు విడుదలవుతున్న ఖైదీల ప్రయాణానికి నిధులు సమకూరుస్తున్న ఈధి ఫౌండేషన్ తాజా పరిణామాన్ని ధృవీకరించింది. ఖైదీలను వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగిస్తామని ఓ అధికారి తెలిపారు. సుహృద్భావ సూచనగా జులైలో మరో బ్యాచ్ భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సముద్ర సరిహద్దులను ఉల్లంఘించినందుకు ప్రత్యర్థి మత్స్యకారులను పాకిస్తాన్, భారతదేశం మామూలుగా అరెస్టు చేస్తాయి. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు చాలా చోట్ల చాలా స్పష్టంగా గుర్తించబడలేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bilawal Bhutto
  • Bilawal Bhutto Zardari
  • india
  • Indian fishermen
  • pakistan
  • world news

Related News

Nuclear Testing

Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Nepal

    Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

  • Strongest Currencies

    Strongest Currencies: ప్ర‌పంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!

Latest News

  • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

  • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

  • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

  • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

  • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd