Indian Fishermen: 200 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్
దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్సర్లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు.
- By Gopichand Published Date - 07:34 AM, Sat - 3 June 23
Indian Fishermen: దాదాపు 200 మంది భారతీయ మత్స్యకారుల (Indian Fishermen)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ భారతీయ మత్స్యకారులు (Indian Fishermen) అమృత్సర్లోని అట్టారీ సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ మత్స్యకారులు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన అనికేత్ అనే మత్స్యకారుడు మాట్లాడుతూ.. “నేను గుజరాత్ నివాసిని. రెండేళ్ల క్రితం చేపలు పట్టే సమయంలో నీటి ప్రవాహం కారణంగా సరిహద్దు దాటి వెళ్లాను. అక్కడ దాదాపు 265 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు” అని తెలిపాడు.
30 నెలల పాటు పాకిస్థాన్ జైల్లో ఉన్నానని మరో మత్స్యకారుడు ఉమర్ చెప్పారు. మేము చేపలు పట్టేటప్పుడు సరిహద్దు దాటి వెళ్ళాం. ఆ తర్వాత పాకిస్తాన్ పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ (పాకిస్థాన్) అక్రమంగా శిక్ష అనుభవిస్తున్న వారిని అక్కడి నుంచి వెంటనే వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపాడు.
Also Read: US Army: అమెరికాలో దారుణం.. యజమాని పైనే తిరగబడిన డ్రోన్.. చివరికి?
అంతకముందు.. మానవతా దృక్పథంతో పాకిస్థాన్ 200 మంది భారతీయ మత్స్యకారులను, మరో ముగ్గురు ఖైదీలను శుక్రవారం విడుదల చేయనుందని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు. దేశ సముద్ర సరిహద్దులో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కరాచీ జైలులో ఉన్న 198 మంది భారతీయ జాలర్లను పాకిస్తాన్ అధికారులు గత నెలలో విడుదల చేశారు. ఈ ఖైదీలను వాఘా సరిహద్దులో భారత్కు అప్పగించారు. బిలావల్ ఒక ట్వీట్లో ఈ రోజు పాకిస్తాన్ 200 మంది భారతీయ మత్స్యకారులు, మరో ముగ్గురు ఖైదీలను విడుదల చేస్తోంది. అంతకుముందు 198 మంది భారతీయ మత్స్యకారులను 2023 మే 12న భారత్ కి అప్పగించినట్లు పేర్కొన్నాడు. ఇది మానవీయ విషయాలను రాజకీయం చేయకూడదనే పాకిస్తాన్ విధానానికి అనుగుణంగా ఉంది. కరుణ రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని పేర్కొన్నాడు.
కరాచీ నుంచి లాహోర్కు విడుదలవుతున్న ఖైదీల ప్రయాణానికి నిధులు సమకూరుస్తున్న ఈధి ఫౌండేషన్ తాజా పరిణామాన్ని ధృవీకరించింది. ఖైదీలను వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగిస్తామని ఓ అధికారి తెలిపారు. సుహృద్భావ సూచనగా జులైలో మరో బ్యాచ్ భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సముద్ర సరిహద్దులను ఉల్లంఘించినందుకు ప్రత్యర్థి మత్స్యకారులను పాకిస్తాన్, భారతదేశం మామూలుగా అరెస్టు చేస్తాయి. రెండు దేశాల మధ్య సముద్ర సరిహద్దు చాలా చోట్ల చాలా స్పష్టంగా గుర్తించబడలేదు.
Related News
Free Screen Replacement : ఆ ఫోన్లు వాడుతున్నారా ? ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్
Free Screen Replacement : మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా ? అయితే మీకే ఈ శుభవార్త.