HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Congress Bjp Are Playing The Game Of Vote Theft Prashant Kishor

Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్

బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్‌ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.

  • By Latha Suma Published Date - 02:34 PM, Sun - 24 August 25
  • daily-hunt
Congress, BJP are playing the game of vote theft: Prashant Kishor
Congress, BJP are playing the game of vote theft: Prashant Kishor

Prashant Kishor : బీహార్ రాష్ట్ర ప్రజలను తప్పుడు దారిలో నడిపిస్తూ వారి అసలైన సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధికోసం పరస్పరం విమర్శలు చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాలను మార్చాల్సిన బాధ్యత ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఓట్ల రాజకీయాన్ని మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్‌ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.

Read Also: Thailand : బ్యాట్‌మొబైల్‌లో వివాహానికి వచ్చిన వరుడు..నెటిజన్లు సరదా కామెంట్లు..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఘాటుగా స్పందించిన కిశోర్, ఆయన ఆర్జేడీ నాయకత్వ సూచనల ప్రకారమే నడుస్తున్నారని, బీహార్‌కు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. బీహార్‌కు వచ్చినప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడటం కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీకి ముఖ్యమవుతోంది. ఇది బీహారి ప్రజల జవాబు కాదు అని ఆయన అన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య పంచ్‌ల వార్ కొనసాగుతుండగా, ఇది ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుండి దూరం చేస్తోందని కిశోర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోడీపై, మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు ఈ తప్పుడు మాటల వలలో చిక్కకూడదు అని ఆయన స్పష్టం చేశారు.

బీహార్‌లో మౌలిక సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోని ఈ రెండు ప్రధాన పార్టీలు, గతంలో అధికారంలో ఉన్నప్పటికీ బీహార్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లలేదని ఆయన ఆరోపించారు. జన్ సూరజ్ పార్టీ ఏర్పాటైన దాని ఉద్దేశం కూడా ఇదేనని, ప్రజల పక్షంలో నిలబడి, వారి జీవితాల్లో వాస్తవిక మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. బీహార్‌లో ఉన్న యువతకు మంచి విద్య, ఉపాధి, గౌరవం కలిగిన జీవితం కల్పించడమే మా పార్టీ ప్రధాన అజెండా. బీజేపీ, కాంగ్రెస్‌లు మళ్లీ అధికారంలోకి రాకూడదనుకుంటే, ప్రజలు తమ పరిష్కారాల కోసం కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అని కిశోర్ పిలుపునిచ్చారు. బీహార్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారగా, జన్ సూరజ్ పార్టీ వేరే దిశలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Mirai First Review: ‘మిరాయ్’ ఫస్ట్ రివ్యూ

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Bihar Elections
  • bjp
  • congress
  • Jan Suraaj Party
  • narendra modi
  • poverty
  • prashant kishor
  • rahul gandhi
  • unemployment

Related News

Sri Lanka

Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్

  • Bihar Speaker

    Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • Bihar Election Congress

    Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

  • Dhwajarohan In Ayodhya

    Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

  • Deepak Prakash

    Bihar Minister: బిహార్‌లో సర్ప్రైజ్ మంత్రి దీపక్ ప్రకాశ్

Latest News

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

  • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

  • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

  • Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd