HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >India Tops Global List Of Young Entrepreneurs

యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం

40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

  • Author : Latha Suma Date : 22-01-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India tops global list of young entrepreneurs
India tops global list of young entrepreneurs

. యూ40 సెంటీమిలియనీర్లలో భారత ప్రభావం

. బెంగళూరు ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’

. తొలితరం వ్యాపారవేత్తల పెరుగుదల, ఉపాధి సృష్టి

Indian Entrepreneurs: ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ జాబితాలో మొత్తం 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా వారిలో 201 మంది భారతీయులే కావడం విశేషం. చైనా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలను భారత్ వెనక్కి నెట్టి, యువ సంపన్నుల విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నివేదిక ప్రకారం చైనా నుంచి 194 మంది యూకే నుంచి 110 మంది యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలు, సాంకేతికత ఆధారిత వ్యాపార నమూనాలతో భారత యువత ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో మారుతున్న వ్యాపార సంస్కృతి, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

దేశంలో యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర బిందువుగా బెంగళూరు మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ నగరం నుంచి ఏకంగా 48 మంది యువ వ్యాపారవేత్తలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఉండటంతో ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’గా బెంగళూరు గుర్తింపు పొందింది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ ఈ నగరాన్ని యువ వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మార్చాయి. ఈ జాబితాలో చోటు పొందాలంటే 36 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి తొలితరం పారిశ్రామికవేత్తలైతే కనీసం 100 మిలియన్ డాలర్ల వ్యాపార విలువ వారసత్వ వ్యాపారవేత్తలైతే కనీసం 200 మిలియన్ డాలర్ల సంపద ఉండాలి. ఈ ప్రమాణాలు భారత యువత వ్యాపార రంగంలో ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత రంగాల్లో భారత యువత చూపుతున్న ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. భారత్‌లో పెరుగుతున్న వ్యవస్థాపక స్ఫూర్తికి ఈ నివేదిక అద్దం పడుతోంది. జాబితాలో ఉన్న భారతీయ యువ పారిశ్రామికవేత్తల్లో 83 శాతం మంది తొలితరం వ్యాపారవేత్తలే కావడం గమనార్హం.

అంటే వారసత్వ వ్యాపారాల కంటే కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలతో స్వయంగా వ్యాపారాలను నిర్మించుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. రంగాల వారీగా చూస్తే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఐటీ సేవల రంగం నుంచి అత్యధికంగా 40 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగం నుంచి 18 మంది, రవాణా రంగం నుంచి 16 మంది, ఆర్థిక సేవల రంగం నుంచి 15 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తల సంస్థల మొత్తం విలువ సుమారు 357 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అంతేకాకుండా ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 4.43 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ మాట్లాడుతూ..ఈ తరం యువ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే దేశ జీడీపీకి, ఉపాధి కల్పనకు కీలకంగా మారారు. వీరి విజయం రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. విద్యాసంస్థల పరంగా చూస్తే ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 15 మంది పూర్వ విద్యార్థులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. మహిళా ప్రాతినిధ్యంలో చైనా ముందుండగా భారత్ నుంచి 15 మంది మహిళా యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉండటం భారత వ్యాపార రంగంలో లింగ సమానత్వం దిశగా సాగుతున్న ప్రగతిని సూచిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aventus Wealth Management
  • business
  • business news
  • china
  • Hurun India
  • india
  • Indian Entrepreneurs
  • UK
  • Young billionaires

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd