HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Centre Notifies Unified Pension Scheme For Employees

Unified Pension Scheme: బడ్జెట్‌కు ముందే కీల‌క నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి UPS అమలు!

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

  • Author : Gopichand Date : 26-01-2025 - 1:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pensioners
Pensioners

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (Unified Pension Scheme)ను నోటిఫై చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ఆప్షన్‌గా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. యూపీఎస్‌ను ప్రభుత్వం నోటిఫై చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడిన, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఈ ఎంపికను ఎంచుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు UPS వర్తిస్తుంది.

దేశ సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్‌కు ముందే కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. UPS గ‌తేడాది ఆగస్ట్‌లో ప్రారంభించారు. ఇది పాత పెన్షన్ స్కీమ్ (OPS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్‌ను అందిస్తుంది. ఇది వారి ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది.

Also Read: Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్‌ పద్ధతి..

ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. పాత పెన్షన్ స్కీమ్ (OPS), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) మధ్య సమతుల్యతను సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఆగస్టు 2024లో UPSని ప్రారంభించిందని అందులో పేర్కొంది.

ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు?

UPS కింద కొన్ని ప్రధాన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు వారి సగటు మూల వేతనంలో 50 శాతం భరోసా పెన్షన్ పొందుతారు. 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు దామాషా పింఛను అందించే నిబంధన ఉంది. ఇది కాకుండా ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేస్తే నెలకు రూ.10,000 పెన్షన్ హామీ ఇవ్వబడుతుంది.

UPS కింద ద్రవ్యోల్బణం ఉపశమనం కూడా ఇవ్వ‌నున్నారు. ఇది కాకుండా ఉద్యోగులు మరణించిన తర్వాత వారి కుటుంబాలకు 60 శాతం కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనం కూడా ఇవ్వనున్నారు. అలాగే పదవీ విరమణ సమయంలో మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Budget 2025
  • business news
  • central govt
  • employees
  • Modi Govt Unified Pension Scheme
  • pm modi
  • Unified Pension Scheme
  • UPS

Related News

Aadhaar

మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • Petrol

    ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • Google Searches

    ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

Latest News

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

  • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • పాకిస్థాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులు.. కోచ్‌ను తొల‌గించిన పీసీబీ!

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd