Bollywood Actress: రూ. 50 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసిన బాలీవుడ్ నటి..!
తన కారులో సాంకేతిక సమస్యలపై వరుసగా 10 సార్లు డీలర్షిప్కు ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొంది. అయితే ఇంతవరకు ఆమె కారు మరమ్మతులు చేయలేదు.
- By Gopichand Published Date - 10:40 AM, Sat - 31 August 24

Bollywood Actress: బాలీవుడ్ నటి (Bollywood Actress) రిమీ సేన్ రూ. 50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్కు లీగల్ నోటీసు పంపింది. తన కారులో చాలా సాంకేతిక లోపాలు ఉన్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ డీలర్షిప్ వద్ద తన ఫిర్యాదును పరిష్కరించలేదని నటి ఆరోపించింది. రిమి సేన్ 2020 సంవత్సరంలో రూ. 92 లక్షల విలువైన ల్యాండ్ రోవర్ వేరియంట్ను కొనుగోలు చేసింది.
కారు సన్రూఫ్లోంచి శబ్దం
నటి ఫిర్యాదు ప్రకారం.. ఆమె ఈ పెద్ద సైజు లగ్జరీ కారును కంపెనీ అధీకృత డీలర్ అయిన సతీష్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసింది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా కారు చాలా తక్కువగా నడిచిందని పేర్కొన్నారు. అయితే ఆమె కారులో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సన్రూఫ్ నుండి శబ్దం రావడం ప్రారంభమైంది. కారు సౌండ్ సిస్టమ్, వెనుక కెమెరా పనిచేయలేదు. దీనిపై ఆమె 2022 ఆగస్టు 25న డీలర్షిప్కు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read: Pakistan Cricket Board: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అమ్మకాలు మొదలుపెట్టిన పాక్ క్రికెట్ బోర్డు..!
మెకానిక్ తప్పును సరిదిద్దడానికి బదులుగా రుజువు అడుగుతున్నాడు
తన కారులో సాంకేతిక సమస్యలపై వరుసగా 10 సార్లు డీలర్షిప్కు ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొంది. అయితే ఇంతవరకు ఆమె కారు మరమ్మతులు చేయలేదు. ప్రతిసారీ డీలర్షిప్ వ్యక్తులు కారును రిపేర్ చేస్తామని హామీ ఇచ్చి వెనక్కి పంపేస్తారని అయితే కారులోని లోపాలను సరిదిద్దడం లేదని చెప్పారు. తప్పును సరిదిద్దడానికి బదులు మెకానిక్ లు తప్పుకు ఆధారాలు అడుగుతున్నారని ఆరోపించారు.
నటి కొత్త కారుతో పాటు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది
చివరగా విసుగు చెందిన రిమీ సేన్ కార్ కంపెనీ.. డీలర్షిప్పై ఫిర్యాదు చేసింది. రూ. 50 కోట్ల నష్టపరిహారం కోసం దావా వేసింది. దీంతో పాటు న్యాయ ప్రక్రియలో అయ్యే ఖర్చులకు బదులు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన కారు స్థానంలో కొత్తదాన్ని తీసుకురావాలని కంపెనీకి విజ్ఞప్తి చేసింది.
We’re now on WhatsApp. Click to Join.