Pakistan Cricket Board: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అమ్మకాలు మొదలుపెట్టిన పాక్ క్రికెట్ బోర్డు..!
వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ ఒప్పందం ఒక బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు జరిగింది. అదే సమయంలో కరాచీ స్టేడియం పేరు హక్కులు 450 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి.
- Author : Gopichand
Date : 31-08-2024 - 10:16 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Cricket Board: వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నిర్వహించాల్సి ఉంది. ఈ ఐసిసి టోర్నమెంట్ను నిర్వహించడంలో పీసీబీ (Pakistan Cricket Board) ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఈ కారణంగా బోర్డు నిధుల సేకరణలో బిజీగా ఉంది. బోర్డు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఈ కారణంగా పీసీబీ వివిధ మార్గాల్లో డబ్బును సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.
చారిత్రక స్టేడియం పేరును విక్రయించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ స్టేడియం పేరు గడ్డాఫీ స్టేడియం. పాకిస్థాన్ క్రికెట్లో గడ్డాఫీ స్టేడియంకు తనదైన ప్రాముఖ్యత ఉంది. బోర్డు ఈ స్టేడియం పేరును 5 సంవత్సరాలుగా ప్రైవేట్ బ్యాంకుకు విక్రయించింది. ఈ డీల్ 1 బిలియన్ పాకిస్థానీ రూపాయలకు (సుమారు రూ. 31 కోట్లు) జరిగింది. డీల్కు సంబంధించి పీసీబీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కరాచీలోని నేషనల్ స్టేడియం లాగే గడ్డాఫీ స్టేడియం కూడా బ్యాంక్ పేరుతోనే పిలవబడుతుందని స్పష్టమైంది.
Also Read: Suryakumar: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్కు గాయం..!
వార్తా సంస్థ PTI ప్రకారం.. ఈ ఒప్పందం ఒక బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు జరిగింది. అదే సమయంలో కరాచీ స్టేడియం పేరు హక్కులు 450 మిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. 1974లో లాహోర్ స్టేడియంకు లిబియా నాయకుడు ముఅమ్మర్ గడ్డాఫీ పేరు పెట్టారు. పీసీబీ మాజీ చైర్మన్, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా స్టేడియం నామకరణ హక్కులను విక్రయించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. రమీజ్ రాజా హయాంలో కరాచీ స్టేడియం కోసం ఒప్పందం జరిగింది. ఈ కారణంగా కరాచీలోని ప్రసిద్ధ నేషనల్ స్టేడియం పేరు ఇప్పుడు నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనాగా మారింది.
దేశంలోని మూడు ప్రధాన స్టేడియాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ స్టేడియాల పేర్లను పిసిబి విక్రయిస్తోంది. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్లో పర్యటించనుందా లేదా అనే దానిపై బిసిసిఐ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లను పంపే విషయంలో బీసీసీఐ సముఖత వ్యక్తం చేయడంలేదు.
We’re now on WhatsApp. Click to Join.