HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Zptc Elections We Are Boycotting Repolling Ys Avinash Reddy

Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.

  • Author : Latha Suma Date : 13-08-2025 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ZPTC elections.. We are boycotting repolling: YS Avinash Reddy
ZPTC elections.. We are boycotting repolling: YS Avinash Reddy

Pulivendula : పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తోంది. నిన్న జరిగిన ఓటింగ్ సందర్భంగా పలుచోట్ల అక్రమాలు చోటు చేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్‌లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.

Read Also: Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

ఈ రీపోలింగ్‌ను వైసీపీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ..ఇది కంటితుడుపు చర్య మాత్రమే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ పులివెందులలో సరికొత్త సంస్కృతిని తీసుకొచ్చింది. అది అక్రమ ఓట్ల కలెక్షన్, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం అంటూ మండిపడ్డారు. మొత్తం 15 బూత్‌లలో అక్రమ ఓట్లు వేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి స్థానిక ఓటర్ల నుంచి ఓటు స్లిప్‌లు తీసుకొని, వారే వేశారు. ఇది న్యాయవ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర అవమానం అని అన్నారు. రూపొందించిన రీపోలింగ్ అనేది పూర్తిగా ‘డ్రామా’ అని అభివర్ణించారు అవినాశ్ రెడ్డి. ఓటర్లను మభ్యపెట్టేందుకు, తప్పుదారి పట్టించేందుకు టీడీపీ ఎన్ని నాటకాలు ఆడినా, ప్రజలు ఎప్పుడూ నిజాన్ని గుర్తిస్తారు అని అన్నారు. ఎన్నికల కమీషన్‌పై కూడా ఆయన నిప్పులు చెరిగారు. నిర్బంధ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ జరగడం బాధాకరం.

ఎన్నికల కమీషన్‌ను రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుందన్న అనుమానం కలుగుతోంది అని అన్నారు. రిపోలింగ్‌ను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలి. ప్రజాస్వామ్య విలువలు రక్షించాలంటే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ తప్పనిసరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలంటే కేంద్ర బలగాల అవసరం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పులివెందుల ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఏదేమైనా, అధికార పార్టీలు, ప్రతిపక్షాలు పరస్పర ఆరోపణలు, విమర్శల మధ్య పులివెందుల ప్రజలే నష్టపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఎన్నికల సమర్థతపై ప్రజల్లో అనేక సందేహాలు కలుగుతున్న ఈ సమయంలో, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.

Read Also: Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Avinash Reddy
  • chandrababu naidu
  • Election commission
  • Pulivendula
  • re-polling
  • tdp
  • ysrcp
  • ZPTC election

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Latest News

  • ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

  • నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

  • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

  • కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

  • వాట్సాప్ లో ఫొటోలు డౌన్లోడ్ చేస్తున్నారా ? అయితే మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ అయినట్లే !!!

Trending News

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd