HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ursa Organization Condemns Ycp False Writings

Ursa Organization: వైసీపీ అవాస్త‌వాల‌ను ఖండించిన ఉర్సా సంస్థ!

ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.

  • Author : Gopichand Date : 23-04-2025 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ursa Organization
Ursa Organization

Ursa Organization: ఉర్సా క్లస్టర్స్ సంస్థ (Ursa Organization) వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సంస్థ ఫౌండర్ జై తాళ్లూరి జూమ్ కాల్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తాము ముందుకొస్తుంటే, నిరాధారమైన నిందలు వేస్తున్నారని అన్నారు.

ఉర్సా సంస్థ గురించి కీలక వివరాలు

ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో రిజిస్టర్ అయిన సంస్థ, భారతదేశంలో పెట్టుబడుల కోసం హైదరాబాద్‌లో తాత్కాలిక చిరునామాతో 2025 ఫిబ్రవరి 12న రిజిస్టర్ అయింది. ఇది రాత్రికి రాత్రి పుట్టిన సంస్థ కాదని, వందలాది మంది ఉద్యోగుల కఠోర శ్రమతో ఏర్పడిందని జై తాళ్లూరి స్పష్టం చేశారు. రూ.5,728.3 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో 300 మెగావాట్ల సామర్థ్యంతో 2,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో విశాఖపట్నంలో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఆర్‌బీఐ ఆమోదించిన FDI పాలసీ ప్రకారం నిబంధనలు పాటిస్తున్నారు.

ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.1 కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించారు. రూ.99 పైసలకు ఎకరం ఇచ్చారనే వైసీపీ ఆరోపణలు అవాస్తవమని, ప్రభుత్వ పాలసీ ప్రకారమే భూమి కేటాయింపు జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం 2 సంవత్సరాల గడువు విధించింది. కార్యకలాపాలు ప్రారంభించకపోతే, భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రాజెక్టును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.

Also Read: Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?

టీమ్ అనుభవం, నిందలపై స్పందన

జై తాళ్లూరి తమ టీమ్‌లో సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తి వంటి దశాబ్దాల అనుభవం ఉన్న సభ్యులున్నారని, టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌లో వారి నైపుణ్యాన్ని తప్పుడు ఆరోపణలతో కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాలుంటే NDA సంతకంతో సంస్థ వివరాలు తెలుసుకోవచ్చని, రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కేశినేని చిన్నితో సంబంధం లేదు

సతీష్ అబ్బూరి, ఎంపీ కేశినేని చిన్నికి ఉర్సా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేశినేని నాని తమపై బురద జల్లుతున్నారని, AI రంగంలో సంస్థ స్థాయి, టర్నోవర్ గురించి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమని జై తాళ్లూరి ఆరోపించారు. ఇలాంటి నిందలతో కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్లేలా చేయాలనే దురుద్దేశంతో ఈ ప్రచారం సాగుతోందని అన్నారు.

ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది. సంస్థ లక్ష్యం యువతకు ఉపాధి కల్పించడమేనని, అన్ని నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా పనిచేస్తామని స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • False Writings
  • nda
  • Ursa
  • Ursa Organization
  • ycp

Related News

Farmers Drumstick

ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Farmers :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జ

  • Botsa Satyanarayana Daughte

    YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

  • Yarlagadda Venkata Rao Loke

    Yarlagadda Venkata Rao : లోకేశ్ విదేశీ పర్యటనపై యార్లగడ్డ ప్రశంసలు, వైసీపీపై విమర్శలు

Latest News

  • ‎బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!

  • ‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd