HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >How Many Terrorists Were Involved In The Pahalgam Attack

Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?

జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది.

  • By Gopichand Published Date - 11:54 AM, Wed - 23 April 25
  • daily-hunt
Terrorists
Terrorists

Terrorists: జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది. ఈ దాడి బాధ్యతను పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఎ-తొయిబా (LeT)తో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) సంస్థ స్వీకరించింది. ఫైరింగ్ తర్వాత ఉగ్రవాదులు (Terrorists) పరారీలో ఉన్నారు. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

దాడి వివరాలు, ఉగ్రవాదుల సమాచారం

ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ఉగ్రవాదులు బాధితుల పేర్లు, మతాన్ని అడిగి, కొందరిని కలిమా చదవమని బలవంతం చేసి గుర్తించిన తర్వాత కాల్పులు జరిపారు. ఈ దాడి 2019 పుల్వామా దాడి తర్వాత జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది.

భద్రతా చర్యలు, ప్రభుత్వ స్పందన

దాడి తర్వాత భారత సైన్యం, CRPF, జమ్మూ-కాశ్మీర్ పోలీసులు బైసరన్ లోయలో విస్తృత శోధన కార్యకలాపాలు చేపట్టాయి. హెలికాప్టర్లు, ఫోలియేజ్ పెనెట్రేటింగ్ రాడార్‌ను ఉపయోగించి ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన ఘర్షణలో భారత సైన్యం ఇద్ద‌రు ఉగ్రవాదులను హతమార్చింది. దీనిని ‘ఆపరేషన్ టిక్కా’గా పిలుస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసి బుధవారం (ఏప్రిల్ 23, 2025) ఉదయం భారత్‌కు తిరిగి వచ్చారు. మోదీ.. ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమై, మధ్యాహ్నం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర గృహమంత్రి అమిత్ షా సైతం శ్రీనగర్‌కు చేరుకొని బాధితులకు నివాళులర్పించి, గాయపడిన వారిని ఆసుపత్రిలో సందర్శించారు. జమ్మూ-కాశ్మీర్‌లో ఒక రోజు సంతాప దినంగా ప్రకటించబడింది.

Also Read: Pahalgam Terror Attack : పహల్గాం కాల్పులు ..ఉగ్రవాది తొలి ఫొటో !

పాకిస్థాన్ స్పందన

ఈ దాడిపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మొదటి స్పందనలో పాకిస్థాన్‌కు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని, తాము అన్ని రకాల ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తామని అన్నారు. ఆయన ఈ దాడి వెనుక భారతీయులే ఉన్నారని, భారత ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, మైనారిటీలపై (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు) ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. ఈ దాడి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికుల తిరుగుబాటుగా ఆయ‌న‌ చిత్రీకరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • LeT
  • Pahalgam Attack
  • Pahalgam Terror Attack
  • pakistan
  • terrorists
  • TRF

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd