HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Palnadu District Dachepalli Village

6 Killed : ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా

  • By Prasad Published Date - 06:24 AM, Thu - 18 May 23
  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున వ్య‌వ‌సాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురజాల డీఎస్పీ పళ్లం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని దామచర్ల మండలం నరసాపురం గ్రామం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం 23 మంది వ్యవసాయ కార్మికులు ఆటోలో వెళ్తున్నారని తెలిపారు. ఆటో పొందుగల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు డీఎస్పీ తెలిపారు.. ఆటోను ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తెలంగాణ వైపు వెళ్లాడని తెలిపారు.

మృతులను ఇస్లావతి మంజుల (25), భూక్య పద్మ (27), పాడియా సక్రి (35), భూక్య సోని (50), మాలావత్ కవిత (30)గా గుర్తించారు. బనావత్ పార్వతి(30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఆరుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని డీఎస్పీ పల్లం రాజు తెలిపారు. పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ రెడ్డి గురజాలలోని జీజీహెచ్‌కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీలైనంత త్వరగా పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పొందుగల వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు లక్షరూపాయ‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురజాలలోని జీజీహెచ్‌ని మిర్యాలగూడ ఎమ్మెల్యే న‌లల్ల‌మోతు భాస్కరరావు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లు సందర్శించారు. మృతుల బంధువులను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాస్కరరావు ఒక్కొక్కరికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి జానా రెడ్డి కోరారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. జానారెడ్డి కోరినట్లు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • dachepalli
  • palnadu
  • road accident
  • telangana

Related News

Telangana Global Summit 2025

Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌.. ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు ఇవే..!

ఈ సమ్మిట్‌లో 500 ప్రముఖ కంపెనీల నుండి 1,300 మంది ప్రతినిధులు, ఐటీ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల నిపుణులు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు.

  • Gramapanchati Cng

    Grama Panchayat Elections : గ్రామ స్వరాజ్యం పునరుద్ధరణ- పంచాయతీ ఎన్నికలతో తెలంగాణకు నవశకం

  • Telangana Local Body Electi

    Grama Panchayat Elections : నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

  • Telangana Global Summit

    Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్ర‌క‌టించే ఛాన్స్‌?!

  • Telangana Rising Summit

    Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

Latest News

  • IND vs SA: రెండో వన్డేలో భారత్‌కు పరాజయం.. దక్షిణాఫ్రికా రికార్డు ఛేదన!

  • Bhuta Shuddhi Vivaham: సమంత ‘భూత శుద్ధి వివాహం’ ఎందుకు చేసుకున్నారో తెలుసా?

  • President Putin: పుతిన్ ఎక్కువ‌గా డిసెంబర్ నెల‌లోనే భారత్‌కు ఎందుకు వ‌స్తున్నారు?

  • Virat Kohli- Ruturaj Gaikwad: సచిన్- దినేష్ కార్తీక్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ-గైక్వాడ్!

  • Blood Pressure: మీకు బీపీ సమస్య ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!!

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd