Andhra Pradesh
-
గౌతమ్ అదానీ, జగన్ రహస్య భేటీ? 9వేల మెగావాట్ల సోలార్ పవర్ మతలబు
ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాలను ప్రభుత్వాలు ప్రజలకు తెలియచేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంటనే అందుకు సంబంధించిన ఉపాథి అవకాశాలు, ప్రభుత్వానికి వచ్చే బెనిఫిట్స్ తదితరాలను వివరించాలి.
Published Date - 10:55 AM, Fri - 24 September 21 -
ఏపీలో స్థానిక ఫలితాల టమారం.. అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
Published Date - 02:19 PM, Thu - 23 September 21 -
రైతుల కోసం టీడీపీ.. జగన్ హయాంలో వ్యవసాయ సంక్షోభం
రైతు కోసం పోరాటాలకు టీడీపీ పదును పెట్టింది. మిర్చి, పత్తి, టమోటా రైతులు నష్టపోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోకస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు మండిపడ్డారు
Published Date - 01:41 PM, Thu - 23 September 21 -
ఏడుకొండలవాడి రూపంలో జగన్ కు హైకోర్టు మొట్టికాయ
హైకోర్టు రూపంలో ఏడుకొండలవాడు ముఖ్యమంత్రి జగన్ కు మరోసారు మొట్టికాయ వేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల జంబో మండలి నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ జారీ చేసిన జీవోను కొట్టిపారేసింది.
Published Date - 02:42 PM, Wed - 22 September 21 -
ఇక సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ బుకింగ్..టిక్కెట్ల విక్రయానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం వెనుక ఏం జరుగుతుంది? బస్ టిక్కెట్లను ఆన్ లైన్లో అందించలేని సర్కార్ ఇప్పుడు సినిమా టిక్కెట్లకు ఆన్ లైన్ పద్ధతిని ఎలా నిర్వహిస్తుందని ప్రశ్న. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఆన్ లైన్ బుకింగ్ ఇటీవల రెడ్ బస్సు పోర్టల్ కు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:35 PM, Tue - 21 September 21 -
ఏపీలో తాలిబన్ల లింకు.. డ్రగ్స్ వెనుక డాన్ ఎవరు?
ఏపీలో తాలిబన్ల కలకలం బయలుదేరింది. సుమారు 9వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారం తాడేపల్లి, తాలిబన్లకు ఉన్న సంబంధంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాడేపల్లి,తాలిబన్లకు ఉన్న లింకు ఏంటో తేల్చాలని కేంద్రాన్ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Published Date - 03:33 PM, Tue - 21 September 21 -
వచ్చే నెల నుంచి లోకేష్ పాదయాత్ర? తెలుగు యువత లో జోష్ నింపేలా బ్లూప్రింట్
జగన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శ లోకేష్ సిద్ధం అవుతున్నాడు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఫైట్ చేయడానికి క్షేత్ర స్థాయికి వెళ్లనున్నారు. గ్రామ స్థాయిలో ప్రజల్ని కలవడానికి పాదయాత్ర లేదా సైకిల్ యాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.
Published Date - 03:26 PM, Tue - 21 September 21 -
ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మతలబు
ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఖజానాకు వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తోంది. కానీ, వివిధ పథకాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాలను ఆ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి
Published Date - 02:40 PM, Mon - 20 September 21 -
ప్రభుత్వం వైపే స్థానిక ఫలితాలు సాధారణ ఎన్నికలకు గీటురాయి కాదు..!
స్థానిక ఎన్నికల బలాన్ని చూసి వైసీపీ సంబరపడుతోంది. జడ్సీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో హవాను ఆ పార్టీ నిలుపుకుంది. సుమారు 90 శాతం మండల పరిషత్ లను, 99శాతం జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 75గాను 74 మున్సిపల్, నగర పంచాయతీను గెలుచుకుంది. ఒక్క తాడిపత్రి మినహా అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి వీచింది. కుప్ప
Published Date - 02:06 PM, Mon - 20 September 21 -
ఏపీ ఆర్థికంపై ఎవరిది నిజం? భేష్ అంటోన్న బుగ్గన లెక్కలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? అభివృద్ది రేటు తగ్గిందా? జగన్ ఇక ప్రభుత్వాన్ని నడపలేడా? రాష్ట్రాన్ని వైసీపీ దివాళ తీయించిందా? అంటే..ఔను అని టీడీపీ అంటోంది. కానీ, వాస్తవాలు వేరని వైసీపీ చెబుతోంది. ఏది నిజమో సామాన్యులకు అంతుచిక్కడంలేదు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 04:18 PM, Sat - 18 September 21 -
చైతూ,సమంత విడాకుల కథ.. తిరుమలదర్శనంలో సమంత
తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణంగా భార్యాభర్తలు వస్తుంటారు. దంపతులు కలిసి దర్శనం చేసుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతుంటారు. అక్కినేని చైతన్య లేకుండా సమంత ఒక్కరే దర్శనం చేసుకోవడం తాజాగా టాలీవుడ్ లో పెద్ద టాక్. ఇటీవల వాళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చైతన
Published Date - 04:11 PM, Sat - 18 September 21 -
తిరుమల జంబో బోర్డుపై దుమారం..నేరస్తులు, రాజకీయ నిరుద్యోగుల అడ్డా
తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రంగా మార్చేస్తున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోంది. దేవస్థానం చరిత్రలో లేని విధంగా 81 మందితో కూడా జంబో బోర్డును నియమించడం విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే, తక్షణం బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్షనేత చ
Published Date - 04:08 PM, Sat - 18 September 21 -
మంత్రి పదవి కోసం జోగి మాస్టర్ స్కెచ్ ..చంద్రబాబు ఇంటిపై దాడి హంగామా
అధినేత ప్రత్యేకంగా గుర్తించాలంటే ఏదో ఒక పెద్ద సంఘటనలో హీరో కావాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్ కూడా ఉంటుంది. అందుకే, ఇప్పుడు మంత్రి పదవిని ఆశిస్తోన్న వైసీసీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెలరేగిపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద అనుచరులతో కలిసి నానా హంగామా సృష్టించారు. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్ ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించడం. పరిపాలనపై ఇలాంట
Published Date - 03:13 PM, Fri - 17 September 21 -
టీటీడీ జంబో బోర్డుపై కుతకుత.. వైకాపా ఎమ్మెల్యే తిరుగుబాటు
మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలికి జంబో టీంను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 81 మందితో కమిటీని జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రుల సిఫారస్సులు, మంత్రి పదవి ఆశించిన కొందరికి, సామాజిక ఈక్వేషన్లు, వ్యాపార, వాణిజ్య వర్గాలను సంతృప్తి పరుస్తూ జంబో కమిటీని వేసింది. కానీ, సొంత పార్టీలోని వాళ్లే ఈ కమిటీలో
Published Date - 05:27 PM, Thu - 16 September 21 -
శ్రీరెడ్డికి జగన్ సహకారం
బహ్రెయిన్ లోని కార్మికులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. ఆ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. తమ యజమానుల ‘అసభ్యకర ప్రవర్తన కారణంగా బహ్రెయిన్ లో ఏపీకి చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్కడి పలువురు కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. విదేశాంగ
Published Date - 03:37 PM, Wed - 15 September 21 -
వినోదానికి కేరాఫ్..సచివాలయాలు
చిత్తూరు జిల్లా కట్టుమంచి గ్రామ సచివాలయంలో సిబ్బంది చేసిన నృత్య వీడియో వైరల్ అయింది. వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఇంటి వద్దకు 500 కంటే ఎక్కువ రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేసే సంస్థలుగా గ్రామ సచివాలయాలు ఉండాలి. వీటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్ల
Published Date - 03:35 PM, Wed - 15 September 21