AP Districts : జై ఎన్టీఆర్ -తూ. గో, ప.గో, కృష్ణా ఔట్?
ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు కానుంది. ఆ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వాభూషన్ ప్రకటించాడు
- By CS Rao Published Date - 01:51 PM, Wed - 26 January 22
ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు కానుంది. ఆ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వాభూషన్ ప్రకటించాడు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దం అయింది. కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించు కోవడానికి జగన్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. జనాభా గణన దేశవ్యాప్తంగా జరగాలి. అది పూర్తి అయిన తరువాత జిల్లాలను విభజించాలి అని కేంద్రం ఆదేశించింది. కానీ, తెలంగాణ రాష్ట్రం విజవంతంగా 33 జిల్లాలతో రియల్ ఎస్టేట్ ను పెంచింది. ఆ క్రమంలో పరిపాలన భవనాలు రావడం తో అభివృద్ధి బాట పట్టింది.
పైగా కేంద్రం జోన్స్ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో ఏపీలో కూడా అలాంటి ఇబ్బందులు ఉండవని జగన్ సర్కార్ భావిస్తుంది. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు జగన్ 25 ప్లస్ 1 మొత్తం గా 26 జిల్లాలను చేస్తున్నాడు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ సిద్దం అయింది.ఈ మొత్తం ప్రక్రియలో గోదావరి , కృష్ణ జిల్లాల పేర్లు గల్లంతు కానున్నాయి. విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్ల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి అని భావిస్తున్నారు. కృష్ణ జిల్లా పేరును అలాగే ఉంచి కొత్తగా ఏర్పడే మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారా? అనేది సందిగ్ధం. ఇక ఇప్పటి వరకు ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు మారనున్నాయి. కేవలం రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మాత్రమే గోదావరి జిల్లా గా నామకరణం చేస్తున్నారు.
హిందూపురం లోక్ సభ పరిధిలోని జిల్లాను సత్యసాయి జిల్లాగా నామకరణం చేస్తారు. అంతే కాదు ఇక నుంచి పుట్టపుర్తి హెడ్క్వార్టర్గా సత్యసాయి జిల్లా ఉంటుంది.చిత్తూర్ జిల్లాలో ఉండే తిరుపతి లోకసభ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు బాలాజీ జిల్లాగా నామకరణం చేస్తున్నారు. కృష్ణాజిల్లా… ఎన్టీఆర్ జిల్లా….రాజమండ్రి … గోదావరి జిల్లా…రాజంపేట లోక్ సభ కేంద్రం అయినప్పటికీ రాయచోటి హెడ్క్వార్టర్గా… అన్నమయ్య జిల్లాగా నామకరణం జరిగింది.
బాపట్ల హెడ్క్వార్టర్గా .. భవపురి జిల్లా గా పేరు పెట్టారు.అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా కొత్తగా ఏర్పాటు చేయటం తో 26 జిల్లాల ఏపీ గా రూపాంతరం చెందనుంది. ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పాడు. ఆ మేరకు ఇప్పుడు నామకరణం చేస్తున్నాడు.
దీనిపై టీడీపీ ఎలాంటి కామెంట్ కానీ , అభినందన కానీ చేయలేదు. కాకపోతే , మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఉంటుందా? లేక కృష్ణా కు బదులుగా ? అనేది తేలాలి. మొత్తం మీద పేర్లు పెట్టటం పై కొన్ని చోట్ల అభ్యంతరాలు మరికొన్ని చోట్ల హెడ్ క్వార్టర్ పెట్టె విషయంలో వ్యతిరేకత ఉంది. అధికారికంగా ప్రకటించిన తరువాత ఈ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే పీఆర్సీ ఇష్యూను మరిపించడానికి ఇలా జగన్ సర్కార్ గేమ్ ఆడుతుందని భావిస్తున్నారు. ఆ క్రమంలో కొత్త జిల్లాల అంశం ఎటు వైపు దారితీస్తుందో..చూద్దాం.
Related News
Prashant Kishor : జగన్ కాన్ఫిడెన్స్కు తూట్లు పొడిచిన ప్రశాంత్ కిషోర్
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. అయితే.. ఇప్పటికే ఏపీలో వార్ వన్ సైడేనని డిసైడయ్యారు ఏపీ వాసులు. వైసీపీని గద్దెదించి టీడీపీ కూటమికి పట్టం కట్టాలని ఫిక్స్ అయ్యారు.