NTR District : ‘ఎన్టీఆర్’ పేరు పై పోరు
విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై రాజకీయ చిచ్చు మొదలైంది.
- By CS Rao Published Date - 02:35 PM, Wed - 26 January 22
విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై రాజకీయ చిచ్చు మొదలైంది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పాటు అయ్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని రంగా-రాధ మిత్రమండలి సూచిస్తోంది. కృష్ణా జిల్లాకు బదులుగా ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని వివాదం లేపింది. ప్రస్తుతం సిద్దం అయిన డ్రాఫ్ట్ ప్రకారం మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఉంది. విజయవాడ కేంద్రంగా కొత్తగా ఎన్టీఆర్ జిల్లా రానుంది.కృష్ణా జిల్లాకు రంగా చేసిన సేవను గుర్తించుకొని వంగవీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలని రంగా-రాధ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర డిమాండ్ చేస్తున్నాడు. రాత పూర్వకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.ప్రస్తుతం నరేంద్ర బీజేపీలో ఉన్నాడు. బీజేపీ లీడర్ గా ఈ డిమాండ్ ఉంచాడా? లేక మిత్ర మండలి అధ్యక్షుడిగా వినతి చేస్తున్నాడా?
అనే దానిపై సందిగ్ధం. ఒక వేళ బీజేపీ కూడా ఈ డిమాండ్ కు మద్దతుగా నిలిస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడనుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి ఉన్నారు. ఆ క్రమంలో నరేంద్ర ఇచ్చిన వినతి పత్రం ఆ పార్టీలోనూ చర్చ గా మారింది.తొలి నుంచి సామాజిక వర్గాల పరంగా విజయవాడ లో పోరు ఉంది. గ్రూప్ పాలిటిక్స్ తో పాటు సామాజిక పోరు నడుస్తోంది. ఆ క్రమంలో ఎన్టీఆర్ పేరు పెట్టడానికి రంగా సామాజిక వర్గం ఆమోదం ఇవ్వదు. పైగా రంగా పేరు విజయవాడ కేంద్రంగా వచ్చే జిల్లాకు నామకరణం చేయాలని డిమాండ్ వస్తుంది.
వైసీపీలోని రంగా సామాజిక వర్గం కూడా ఇలాంటి డిమాండ్ కు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాకుండా ఉండలేరు. ఇక టీడీపీలోనూ ఆ సామాజిక వర్గం నాయకులు రంగాకే జై కొట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీడీపీ పార్టీ పరంగా ఎన్టీఆర్ పేరు పెట్టటంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీ అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సిందే. ఆ క్రమంలో సామాజిక వర్గాల పరంగా పార్టీలకు అతీతంగా వాయిస్ వినిపించే అవకాశం ఉంది. ఇప్పుడే బీజేపీ లీడర్ నరేంద్ర ప్రారంభించిన డిమాండ్ సామాజిక కోణంలో పోరుకు దారితీసే పరిస్థితి ఉంది. ఏపీ సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ జిల్లాను విజయవాడ కేంద్రంగా ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. అదే మాట పై ఉంటాడా? లేక మచిలీపట్నం వైపు ఆలోచించి చివరి నిమిషంలో మనసు మెస్ర్చుకుంటాడా? అనే సందిగ్ధం ఉంది. మచిలీపట్నం కు మధ్యే మార్గంగా వంగవీటి రంగ పేరు పెడతారా? అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని సామాజిక కోణంలో తీసుకు వెళ్లడం శోచనీయం.
Related News
Vangaveeti Ranga : కాపు ఓట్ల కోసం జగన్ వంగవీటి రంగా పేరు వాడుకుంటున్నారా..?
టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య ఇటీవల పొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఉద్రిక్తతలను రేకెత్తించింది. ముఖ్యంగా పొత్తు తర్వాత కాపు సామాజికవర్గం మద్దతు టీడీపీ వైపు మళ్లడం గురించి. వంగవీటి రంగా (Vangaveeti Ranga) పేరు చెప్పుకుని కాపు సెంటిమెంట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ పరిణామంపై ప్రత్యేకించి ఆందోళన చెందుతున్నారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగ