AP Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు.
- By Sudheer Published Date - 03:59 PM, Thu - 25 April 24
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో అగ్రనేతలు వరుసగా పర్యటించబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీజేపీ తరపున ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. అమిత్ షా, రాజ్ నాత్ సింగ్ వంటి వారు ఇప్పటికే తెలంగాణలో సభలు నిర్వహించారు. ఏపీలోనూ ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వచ్చే రెండు వారాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తనుంది. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు , ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో 175 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు , 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం వరకూ 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు మరో వెయ్యి వరకూ దాఖలయ్యే అవకాశం ఉంది. మొత్తం ఎన్ని దాఖలయ్యాయన్నదానిపై అధికారిక ప్రకటన ఈసీ చేసే అవకాశం ఉంది.
Read Also : Jagan : అవినాష్రెడ్డి జీవితం నాశనం చేయాలని చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారు – జగన్
Related News
Heatwave: ఎన్నికల ప్రచారంపై ఎండల ఎఫెక్ట్..?
ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ పట్టి పీడిస్తున్న వేడిగాలులు రాజకీయ పార్టీల ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.