HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Sketch For The Comprehensive Development Of Ap Chandrababus Master Plan

Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 29-11-2025 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbn
Cbn

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు వేగంగా పరిష్కారం కావాలంటే వారంతా ఒక జాయింట్ కమిటీగా ఏర్పడితే బాగుంటుందని సూచించారు. అప్పుడు వారితో చర్చించి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధే ధ్యేయంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శనివారం రోజున మీడియాతో జరిగిన చిట్ చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలోని మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని.. అందుకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే రాజధాని రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్‌ కిందకు రావాలని చంద్రబాబు సూచించారు. వారందరూ కలిసి జేఏసీగా ఏర్పడితే సమస్యల పరిష్కారం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

మరోవైపు రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పూర్వోదయ పథకం కింద రాయలసీమ ప్రాంతానికి రూ.40 వేలకోట్లతో ఓ సమగ్ర ప్రణాళిక అమలుచేసేందుకు కసరత్తు జరుపుతోంది. క్లస్టర్ల ద్వారా ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఇతర దేశాల్లోనూ డిమాండ్ ఉన్న అరటి, మామిడి, దానిమ్మ, బొప్పాయి వంటి పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. రాయలసీమ రైతులకు డ్రిప్ రాయితీలు అందించటంతో పాటుగా వారి పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల కోసం ఎయిర్ కార్గో ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. అలాగే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్ల వంటివి ఏర్పాటు చేసేందుకు ఆలోచనలు చేస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాంతానికి అతి ముఖ్యమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటుగా చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే.. ఉత్తరాంధ్ర ప్రాంతం ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, ఆ చుట్టు పక్కల జిల్లాలలో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, లులూ, యాక్సెంచర్ వంటి అంతర్జాతీయ సంస్థలు అక్కడ పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఇక కోస్తా ప్రాంతం విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో వ్యవసాయంతో పాటుగా పర్యాటకం, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తీర ప్రాంతం వెంబడి బీచ్‌లను అభివృద్ధి చేసి.. పర్యాటకులకు ఆకర్షించాలని భావిస్తున్నారు. అలాగే పోర్టులను అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • Special Zones

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

    • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

    • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd