HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ka Paul Says He Will Go To Pakistan Do You Know What He Will Do There

KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్‌కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన

భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు.

  • Author : Pasha Date : 08-05-2025 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ka Paul Pakistan Ys Jagan India Vs Pakistan Andhra Pradesh Politics

KA Paul : భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ సంచలన కామెంట్స్ చేశారు.   ‘‘నేను రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నాను. ఈక్రమంలో ఇటీవలే రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలిశాను. యుద్దాన్ని ఆపే శక్తి నాకే ఉందని వారు చెప్పారు. మే 10న ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్తాను.  నేను భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో ఉన్నాను. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నటైంలో 2002లో నేను పాకిస్తాన్‌కు వెళ్లాను. భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.

Also Read :Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..

జగన్, పవన్, చంద్రబాబు, లోకేశ్‌లపై కీలక వ్యాఖ్యలు

‘‘ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసలు క్రిస్టియన్ కాదు. జగన్ చినజీయర్ స్వామి భక్తుడు. నా ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయాడు. పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయమని నేను హైకోర్టును ఆశ్రయిస్తే  రూ. 5 లక్షలు డిపాజిట్ చేయమని జడ్జి చెప్పారు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు. “కేఏ పాల్‌కు అధికారం వస్తేనే పాలన మారుతుంది” అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ కేఏ పాల్ తేల్చి చెప్పారు. ‘‘ఎన్నికల ముందు 30 వేల మంది అదృశ్యమైన అమ్మాయిల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు మోడీని విమర్శించి ఇప్పుడు ఆయనే గొప్ప ప్రధాని అంటున్నారు’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘గతంలో చంద్రబాబు సైతం మోడీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు విశ్వగురు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు’’ అని కేఏ పాల్ విమర్శించారు. ‘‘లోకేశ్ అయితే మోడీని వంద మిస్సైళ్లతో పోల్చారు.కానీ ఆ మిస్సైల్ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే.. ‘పడిపోయే మిస్సైల్’’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read :Operation Sindoor : పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్‌ దాడి..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • india
  • India vs Pakistan
  • ka paul
  • pakistan
  • ys jagan

Related News

Silver

బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడ

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • AP Deputy CM Pawan Kalyan Strong Warning to YSRCP

    మరోసారి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • India Rice Export To Iran

    ఇరాన్‌కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!

  • Venezuela Hands Over 50M Barrels Of Oil To USA

    అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

Latest News

  • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

  • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

  • ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

  • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd