HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Women In Andhra Pradesh Free Gas Connections

ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-12-2025 - 10:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Gas Connection In Ap
Free Gas Connection In Ap

Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఏపీలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
  • రూ.2వేలు కట్టాల్సిన పనిలేదు.. ఉచితంగానే
  • 2025-26కు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. అయితే పేద మహిళల కోసం కేంద్రం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను తీసుకురాగా.. ఈ పథకం నాలుగేళ్లుగా నిలిచిపోయినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించారు. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద మహిళలకు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు.. దీనివల్ల ఎంతోమంది మహిళలకు వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

ఈ మేరకు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తోంది. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకం కింద, సిలిండర్‌కు రూ.1,700, రెగ్యులేటర్‌కు రూ.150, ఒక మీటరు పైపుకు రూ.100, గ్యాస్ పుస్తకానికి రూ.25, ఇంట్లో బిగించేందుకు రూ.75 ఖర్చు అవుతుంది. ఈ మొత్తం రూ.2,050ను ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. అంటే, ప్రజలకు గ్యాస్ కనెక్షన్ పొందడం చాలా సులభం అవుతుంది. మొదటి సిలిండర్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత సిలిండర్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం రూ.300 రాయితీని ఇస్తుంది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రతి జిల్లాలో ‘జిల్లా ఉజ్వల కమిటీ’ని నియమించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి, వారి ఇంట్లో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి.

వలస కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారు కూడా అవసరమైన పత్రాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. అయితే, నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అర్హులైన పేద మహిళలు దగ్గరలోని ఏజెన్సీల వద్దకు వెళ్లి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందవచ్చు. అర్హులైన ప్రతి మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP CM Chandrababu Naidu
  • AP Kutami Govt
  • free gas
  • Free gas cylinder scheme
  • Free gas in AP
  • Pradhan Mantri Ujjwala Yojana
  • women

Related News

Godavari Pushkaralu 2027

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున

    Latest News

    • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

    • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

    • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

    Trending News

      • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd