HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Devotees Can Have Darshan Of Lord Shiva In 1 2 Hours With Ai Ttd Chairman Br Naidu

TTD : ఏఐతో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సంక్షేమమే తితిదే యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.

  • By Latha Suma Published Date - 04:49 PM, Wed - 20 August 25
  • daily-hunt
Devotees can have darshan of Lord Shiva in 1-2 hours with AI: TTD Chairman BR Naidu
Devotees can have darshan of Lord Shiva in 1-2 hours with AI: TTD Chairman BR Naidu

TTD : తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో భక్తులకు 1-2 గంటల్లో దర్శనమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..భక్తుల సంక్షేమమే టీటీడీ యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.

Read Also: Shashi Tharoor : మరోసారి శశి థరూర్ భిన్న స్వరం..‘అనర్హత’ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు

టీటీడీలో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిపై కూడా సంస్థ దృష్టి సారించింది. ఈ తరహా సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేయడమో, లేక వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడమో చేస్తామని నాయుడు తెలిపారు. అదేవిధంగా టీటీడీ పరిపాలనా వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఎవరైనా అన్యమత ప్రచారాల్లో పాల్గొంటే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ ద్వారా ఒంటిమిట్టలో నిరంతర అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్టు నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ రూ.4 కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 12 మంది వైకాపా అనుచరులకు తిరుమలలో హోటళ్లను కేటాయించారని, ఆ వ్యవస్థ మొత్తం మాఫియాలా తయారైందని నాయుడు విమర్శించారు. ప్రస్తుతం ఈ-టెండర్ల విధానం ద్వారా పారదర్శకతతో హోటళ్ల కేటాయింపు జరుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను తిరుమలలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనాల సందర్భంలో, అలాగే ప్రసాదాల అంశంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు తితిదే సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు అప్‌డేట్ చేయడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచడం మొదలైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలో వీఐపీ దర్శనాలు ఉదయం 10 గంటల వరకు కొనసాగడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు తలెత్తేవని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీఐపీ దర్శనాలను ఉదయం 8 నుంచి 8:30 గంటల మధ్య ముగించేలా చర్యలు చేపడుతున్నట్టు నాయుడు వెల్లడించారు. ఈ మార్పులతో పాటు భక్తులకు మరింత అనుకూలంగా సమర్థవంతంగా సేవలు అందించేందుకు టీటీడీ నిరంతరం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన తెలిపారు. భక్తుల సంతృప్తే తమకు ప్రధానమైన లక్ష్యమని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు.

Read Also: Mushrooms : వర్షాకాలంలో పుట్టగొడుగులు తినొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Artificial Intelligence (AI)
  • devotees
  • Srivari Darshanm
  • ttd
  • TTD Chairman BR Naidu

Related News

Artificial Intelligence in India.. A new revolution in the form of 'Reliance Intelligence': Mukesh Ambani

Reliance Intelligence : భారత్‌లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ

భారతదేశంలో ఈ ఏఐ విప్లవాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున, ఆయన ‘రిలయన్స్ ఇంటెలిజెన్స్’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

    Latest News

    • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

    • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

    • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

    • DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?

    • Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

    Trending News

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

      • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

      • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd