HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cii Conference In Visakhapatnam

CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!

  • By Vamsi Chowdary Korata Published Date - 11:41 AM, Thu - 13 November 25
  • daily-hunt
Cii Summit 2025 Visakhapatn
Cii Summit 2025 Visakhapatn

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్‌కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శుక్రవారం (నవంబర్ 14) నుంచి శనివారం (నవంబర్ 15) వరకు రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు.

సీఐఐ సదస్సు నేపథ్యంలో విశాఖ సాగరతీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనాలు ఉన్నాయి. గవర్నర్‌తో పాటు ఉప రాష్ట్రపతి కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సదస్సులో భాగంగా భాగంగా మూడు రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరిక లేకుండా పనిచేయనున్నారు. సీసీఐతో కలిసి ఏపీ నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు షెడ్యూల్ ఇదే.

విశాఖలోని హోటల్ నోవోటెల్‌లో ఉదయం.. ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్-ఇండియా- యూరప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ అనే అంశంపై బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, తైవాన్.. ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం పవన్, రెన్యూఎస్పీపీ పంప్స్‌ లిమిటెడ్, మురుగప్ప గ్రూప్, బాలాజీ యాక్టన్‌ బిల్డ్‌వెల్, హీరో ఫ్యూచర్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతారు. ఇక సాయంత్రం విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. సీఐఐ మండలి ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.

సీఐఐ సదస్సు ప్రారంభం తర్వాత.. ‘టెక్నాలజీ, ట్రస్ట్‌ అండ్‌ ట్రేడ్‌’ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ‘ఏఐ ఫర్‌ వికసిత్‌ భారత్‌’ సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత సింగపూర్‌ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇక సాయంత్రం ఏపీలో ఆర్థికశాఖ నిర్వహించే ‘రీ ఇమేజినింగ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ సమిట్‌’లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌తో సమావేశంలో.. వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్‌లో లూలూ గ్రూప్ నిర్మించే మాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

రెండో రోజు ఉదయం బ్లూమ్‌బర్గ్‌ మీడియా సమావేశం జరిగుతుంది. అందులో సీఎం పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడతారు. ఆ తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్‌ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జపాన్, కెనడా, న్యూజిలాండ్, బహ్రెయిన్, ప్రతినిధులతో జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం నిర్వహించే.. ‘సెంటర్‌ ఫర్‌ ఫ్రాంటియర్‌ టెక్నాలజీస్‌’ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్‌ ప్రకటించిన డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాల ప్రోగ్రాం ఉంటుంది. సీఐఐ సదస్సు చివరగా నిర్వహించే మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. ఈ సమిట్‌లో చేసుకున్న ఒప్పందాల వివరాలను వెల్లడిస్తారు.

సీఐఐ సదస్సులో అమరావతికి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రూ. 44,600 కోట్ల పెట్టుబడులకు ఈ సదస్సులో అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం. టూరిజం, హెల్త్, మీడియా సిటీ, క్రీడలు, నాలెడ్జ్ సిటీ, రివర్ ఫ్రండ్ వంటి ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 33 ఒప్పందాలు కుదరనున్నట్లు సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu
  • CII Summit 2025
  • nara lokesh
  • Visakhapatnam

Related News

Ap Govt

Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివ

  • Mopidevi Subramanyeswara Sw

    Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

  • Akhanda 2

    Akhanda 2: బాల‌య్య‌కు శుభ‌వార్త చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కార్‌!

  • Apsrtc

    APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

  • Cbn Acb Court

    AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

Latest News

  • Putin Staying Suite: ఐటీసీ మౌర్యలో కట్టుదిట్టమైన భద్రత.. పుతిన్ కోసం ‘చాణక్య సూట్’ సిద్ధం, ప్ర‌త్యేక‌త‌లీవే!

  • Akhanda 2 : తెలంగాణ లో ఈరోజు రాత్రి 8 గంటల నుండే అఖండ 2 ప్రీమియర్స్ ..టికెట్స్ ధరలు ఎలా ఉన్నాయంటే !!

  • Gambhir- Agarkar: టీమిండియాను నాశ‌నం చేస్తున్న అగార్క‌ర్‌, గంభీర్!

  • Gannavaram : రూ. 90 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ

  • RCB: ఆర్సీబీ జ‌ట్టును కొనుగోలు చేయ‌బోయేది ఇత‌నేనా?!

Trending News

    • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

    • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    • PM Modi AI Video: ప్ర‌ధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయ‌టం క‌రెక్టేనా?!

    • Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్.. ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

    • Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd