HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >50 Kg Silver Panapattam Donation By Hyderabad Devotee To Mopidevi Subrahmanyeshwara Swamy

Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

  • Author : Vamsi Chowdary Korata Date : 04-12-2025 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mopidevi Subramanyeswara Sw
Mopidevi Subramanyeswara Sw

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ భక్తులు 50 కిలోల వెండితో అద్భుతమైన పానవట్టాన్ని కానుకగా ఇచ్చారు. కోటి రూపాయల విలువైన ఈ పానవట్టం ఆలయానికి కొత్త శోభను తెస్తుంది. భక్తులు ఆలయంలో అన్నప్రసాద వితరణకు కూడా విరాళాలు అందిస్తారు. వివాహాలు ఆలస్యమైనా, సంతానం లేకున్నా మోపిదేవిని దర్శిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగదోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి.

కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తుడు ఖరీదైన కానుకను అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన రావి వీరరాఘవ చౌదరి, సౌభాగ్యలక్ష్మి దంపతులు 50 కిలోల వెండితో తయారు చేయించిన పానవట్టాన్ని విరాళంగా అందించారు. ఈ పానవట్టం ప్రత్యేకత ఏమిటంటే.. మండపం కూడా ఉంది. ఈ అద్భుతమైన కానుకను గురువారం ఉదయం పూజల అనంతరం ఆలయంలో అలంకరించనున్నారు. ఈ పానవట్టం తయారీకి సుమారు కోటి రూపాయలు ఖర్చయినట్లు దాతల ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌లోని నిపుణులైన కళాకారులు ఈ పానవట్టాన్ని ఎంతో శ్రద్ధతో, కళాత్మకంగా తీర్చిదిద్దారు. 50 కిలోల స్వచ్ఛమైన వెండిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. ఈ పానవట్టం ఆలయానికే ప్రత్యేక శోభను తీసుకురానుంది. ఈ సందర్భంగా దాతల్ని ఆలయ అధికారులు అభినందించారు.

కృష్ణా నది ఒడ్డున ఉన్న మోపిదేవి పుణ్యక్షేత్రం వెలసింది. వివాహాలు ఆలస్యమవుతున్నవారు మోపిదేవిని దర్శిస్తే తప్పకుండా వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే, సంతానం లేని దంపతులు ఈ పవిత్ర స్థలంలో ఒక రాత్రి గడిపితే వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మోపిదేవి ఆలయంలోని శివలింగం ప్రత్యేకత ఏమిటంటే, అది పాముచుట్టలపైనే ప్రతిష్ఠించబడి ఉంటుంది. అభిషేకం, అర్చన చేసే సమయంలో పాలు పోయడానికి పానవట్టం కింద ఒక రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంలోనే పాలు పోస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మోహినీపురం అని పిలిచేవారు. కాలక్రమేణా, ఈ పేరు మోపిదేవిగా మారిందని స్థానిక కథనం. ఈ ఆలయం కృష్ణా నది తీరంలో ఉండటం వల్ల దీనికి మరింత ప్రాశస్త్యం చేకూరింది.

మోపిదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దృష్టి, వినికిడి లోపాలు, శారీరక బలహీనతలు, చర్మ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ అభిషేకం, అర్చన పూజలు చేయించుకుంటే ఉపశమనం పొందుతారని నమ్మకం. అంతేకాకుండా, విద్య, ఐశ్వర్య వృద్ధి కూడా కలుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా, ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు వివాహాలు ఆలస్యమయ్యేవారికి, సంతానం లేని దంపతులకు మేలు చేస్తాయని ప్రసిద్ధి. ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహాలు ఆలస్యమయ్యేవారికి త్వరగా వివాహం జరుగుతుందని, సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని ముఖ్య విశేషం. నాగదోషం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నవారు మోపిదేవి ఆలయంలో నమ్మకంతో పూజలు చేయించుకుంటే దోషం తొలగిపోతుందని భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయానికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిత్యం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు మోపిదేవి ఆలయానికి భారీగా తరలి వస్తుంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 50 Kg Silver Panavatta
  • Andhrapradesh
  • Devotee
  • hyderabad
  • mopidevi
  • Mopidevi Subrahmanyeshwara Swamy Temple
  • Raavi Veeraraghava Chowdary
  • Subrahmanyeshwara Swamy

Related News

Scooty Theft

ఉండవల్లిలో దొంగలు చోరీ.. 20 స్కూటీల డిక్కీలను ఓపెన్‌ *** ?

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఇద్దరు ఆగంతకులు హల్ చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వీరు చేసిన పనికి ఊరిజనం అవాక్కయ్యారు. పొద్దున్నే లేచి ఇంటి ముందు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు దీనికి కారణమని గుర్తించారు. వారిని కనిపెట్టే పనిలో

  • Cm Revanth Vs Aravind

    రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్

  • Kanipakam temple

    అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

  • CM Chandrababu

    దేశంలో రెండో గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు రెడీ చేసిన ఏకైక సీఎం చంద్ర‌బాబు!

  • Police Traffic Restrictions

    మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు

Latest News

  • శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !

  • తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?

  • అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ

  • అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు

  • ఏపీకి సోనియా గాంధీ, రాహుల్

Trending News

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd