Malaysian Landslide: కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి.. మరికొందరు గల్లంతు
మలేషియాలో కొండచరియలు (Malaysian Landslide) విరిగిపడటంతో 18 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తు సంఘటన శుక్రవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 3 గంటలకు రాజధాని కౌలాలంపూర్కు సరిహద్దులో ఉన్న సెలంగోర్ రాష్ట్రంలోని ఒక భాగంలో జరిగింది.
- By Gopichand Published Date - 09:07 AM, Sat - 17 December 22
మలేషియాలో కొండచరియలు (Malaysian Landslide) విరిగిపడటంతో 18 మంది మృతి చెందగా, డజన్ల కొద్దీ గల్లంతైనట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తు సంఘటన శుక్రవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 3 గంటలకు రాజధాని కౌలాలంపూర్కు సరిహద్దులో ఉన్న సెలంగోర్ రాష్ట్రంలోని ఒక భాగంలో జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న క్యాంప్సైట్ (టేంట్ పిచ్) వద్ద కొండచరియలు విరిగిపడినట్లు ఏజెన్సీ రాయిటర్స్ అధికారులకు సమాచారం అందించింది.
మలేసియాలో మృత్యువు విలయ తాండవం చేసింది. ఓ వ్యవసాయ క్షేత్ర పర్యాటక శిబిరంపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి చెందగా, మరో 15 మంది ఆచూకీ కానరాలేదు. వీరు మట్టిశిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మలేసియా రాజధాని కౌలాలంపుర్కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని బతాంగ్ కాలిలో శుక్రవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో 90 మందికి పైగా పర్యాటకులు అక్కడ గుడారాలు వేసుకొని నిద్రిస్తున్నారు. వీరంతా నిద్రలో ఉండగానే 30 మీటర్ల ఎత్తు నుంచి భారీ శబ్దంతో కొండచరియలు విరిగిపడ్డాయి. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాంప్సైట్ నిర్వహిస్తున్న పొలంలోనే కొండ కొంత భాగం పడిపోయింది. క్యాంప్సైట్ను నిర్వహించడానికి లైసెన్స్ తీసుకోలేదు. ‘క్యాంప్సైట్’ అంటే ప్రజలు సమయం గడపడానికి గుడారాలు వేసుకునే ప్రదేశం. ఇటువంటి ప్రదేశాలు స్థానిక ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. సూఫీన్ ప్రకారం.. చనిపోయిన వారిలో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. దాదాపు 25 మంది కోసం సహాయక సిబ్బంది వెతుకుతున్నారు. 53 మందిని సురక్షితంగా రక్షించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 400 మంది సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు.
Also Read: Ireland prime minister: ఐర్లాండ్ ప్రధానిగా మరోసారి భారత సంతతి వ్యక్తి
సెలంగోర్ అగ్నిమాపక విభాగం ప్రకారం.. సంఘటన తెల్లవారుజామున 2.24 గంటలకు నివేదించబడిన అరగంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడం ప్రారంభించారు. దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వార్తా సంస్థ ‘బెర్నామా’ కొన్ని చిత్రాలను పంచుకుంది. అందులో రెస్క్యూ వర్కర్లు చీకటి వేళల్లో టార్చ్ల వెలుగులో శిధిలాలను తొలగిస్తున్నారు. రక్షించిన వ్యక్తులను సంఘటనా స్థలం నుండి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే సిబ్బంది కనిపించారు. కొన్ని కుటుంబాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఉంచారు.
Related News
Alejandra Rodríguez: మిస్ యూనివర్స్గా 60 ఏళ్ల భామ.. ఎవరీ అలెజాండ్రా రోడ్రిగ్జ్..?
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతిచోటా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 గురించి చర్చ జరుగుతోంది. ఈ టైటిల్ను అర్జెంటీనాలోని లా ప్లాటా నివాసి అలెజాండ్రా రోడ్రిగ్జ్ గెలుచుకున్నారు.