HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >First Cross Sea Bullet Train Starts In China Will Travel 350 Kilometers In One Hour

Cross-Sea Bullet Train: చైనాలో తొలి క్రాస్ సీ బుల్లెట్ ట్రైన్, గంటకు 350 కిలోమీటర్లు

ఒకప్పుడు బులెట్ ట్రైన్ అంటే జపాన్ గుర్తుకు వచ్చేది. జపాన్ విశ్వసనీయ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.బుల్లెట్ రైలు విషయంలో కూడా జపాన్ ఈ ప్రత్యేకతను కొన‌సాగించింది

  • By Praveen Aluthuru Published Date - 11:17 AM, Sun - 1 October 23
  • daily-hunt
Cross Sea Bullet Train
Cross Sea Bullet Train

Cross-Sea Bullet Train: ఒకప్పుడు బులెట్ ట్రైన్ అంటే జపాన్ గుర్తుకు వచ్చేది. జపాన్ విశ్వసనీయ సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.బుల్లెట్ రైలు విషయంలో కూడా జపాన్ ఈ ప్రత్యేకతను కొన‌సాగించింది.అయితే ఇప్పుడు ఆ దారిలోకి చైనా వచ్చి పడింది. చైనాలో తొలి క్రాస్ సీ బుల్లెట్ ప్రారంభమైంది. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది

అభివృద్ధి రేసులో చైనా ముందంజలో ఉంది, అందుకే నిరంతరం కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా చైనా మరో ముందడుగేసింది. సముద్రంపై గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల తొలి హై స్పీడ్‌ రైల్వే మార్గాన్ని చైనా ప్రారంభించింది. పుజియాన్‌ ప్రావిన్స్‌లో రెండు ప్రధాన నగరాలు ఫుజౌ-జియామెన్‌ మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చైనా ఈ లైన్‌ను ప్రారంభించింది. ఈ మార్గంతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సుమారు గంట సమయం తగ్గనుంది. మొత్తం 277 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఫుజౌలో ప్రారంభమై జియామెన్‌ మీదుగా వెళ్లి జాంగ్‌జౌలో ముగుస్తుంది. ఇంటెలిజెండ్‌ రోబోట్‌లు, పర్యావరణ అనుకూల పదార్థాలతో ఈ క్రాస్‌-సి బ్రిడ్జ్‌ను నిర్మించారు.ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైలు గమ్యాన్ని చేరుకోవడానికి మూడు తీర వంతెనలను దాటుతుంది.

కొత్త లైన్ ప్రారంభంతో పెట్టుబడులు మరియు రవాణా సులభతరం అవుతుందని చైనా భావిస్తోంది. ఈ రాష్ట్రం నుండి తైవాన్‌కు మంచి లింకప్ లైన్ కూడా ఉంటుంది. దీనితో పాటు చైనా తన హుబీ ప్రావిన్స్ రాజధాని వుహాన్‌లో మోనోరైల్ లైన్‌ను ప్రారంభించింది. ఇది పదిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది పూర్తిగా ఆటోమేటిక్. తద్వారా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు చైనా తన రైలు నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది.

Also Read: Lokesh Hunger Strike : రేపు ఢిల్లీలో లోకేష్ నిరాహారదీక్ష.. చంద్రబాబు, భువనేశ్వరి దీక్షకు సంఘీభావం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 350 kilometers
  • bullet train
  • china
  • cross-sea

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd