HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >After A Historic Trade Deal America Suffered A Setback

అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 10-02-2026 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

America: భారత్- అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత అమెరికా భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌లను 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. వీటితో పాటు పలు ఉత్పత్తులపై ఇరు దేశాలు ‘జీరో టారిఫ్’ (సున్నా సుంకం) విధానానికి అంగీకరించాయి. ఈ పరిణామంతో భారత్- అమెరికా మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో భారత్ తీసుకున్న ఒక నిర్ణయం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. రాబోయే ‘గాజా శాంతి సమావేశానికి’ హాజరుకాకూడదని భారత్ నిర్ణయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయెల్ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశాయి. ఈ శాంతి ప్రణాళికను పర్యవేక్షించేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అనేక దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

Also Read: రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!

అయితే ఈ బోర్డులో పాకిస్థాన్, తుర్కియే (టర్కీ) దేశాలు కూడా భాగస్వాములుగా ఉండటంతో భారత్ మొదటి నుంచీ ఈ బోర్డుకు దూరంగా ఉంటూ వస్తోంది. ఫిబ్రవరి 19న గాజా శాంతి బోర్డు తొలి సమావేశం జరగనుంది. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ సమావేశానికి హాజరవుతుందని అంతా ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం భారత్ తన పాత వైఖరికే కట్టుబడి ఉంది.

బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ట్రంప్ ప్రతిపాదించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని, అందుకే తొలి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జరిగే పరిణామాలను బట్టి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని భారత్ యోచిస్తోంది. ఇటీవల అరబ్ లీగ్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన భేటీలో కూడా ట్రంప్ శాంతి బోర్డు గురించి చర్చకు వచ్చింది. ఈ బోర్డులో అనేక అరబ్ దేశాలు ఉన్నప్పటికీ అవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Gaza Attack
  • india
  • pm modi
  • Trump
  • USA- India
  • world news

Related News

Ceasefire

మ‌రో సీజ్‌ఫైర్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌!

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఈ ఒప్పందానికి వాషింగ్టన్‌లో పునాది పడిందని, అక్కడ ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు ముఖాముఖిగా కలిశారని ఆయన తెలిపారు.

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

  • Iran-US War

    ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం.. ఇప్పుడు ఏం జ‌ర‌గ‌బోతుంది?

  • Strait Of Hormuz

    హోర్ముజ్ జలసంధి.. అమెరికా సంచ‌ల‌న వాద‌న‌!

Latest News

  • Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • వామ్మో చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

  • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్‌?!

  • Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Trending News

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

    • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

    • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd