అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భారత్!
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 10-02-2026 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
America: భారత్- అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత అమెరికా భారత్పై విధిస్తున్న టారిఫ్లను 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. వీటితో పాటు పలు ఉత్పత్తులపై ఇరు దేశాలు ‘జీరో టారిఫ్’ (సున్నా సుంకం) విధానానికి అంగీకరించాయి. ఈ పరిణామంతో భారత్- అమెరికా మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో భారత్ తీసుకున్న ఒక నిర్ణయం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. రాబోయే ‘గాజా శాంతి సమావేశానికి’ హాజరుకాకూడదని భారత్ నిర్ణయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయెల్ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశాయి. ఈ శాంతి ప్రణాళికను పర్యవేక్షించేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అనేక దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
Also Read: రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!
అయితే ఈ బోర్డులో పాకిస్థాన్, తుర్కియే (టర్కీ) దేశాలు కూడా భాగస్వాములుగా ఉండటంతో భారత్ మొదటి నుంచీ ఈ బోర్డుకు దూరంగా ఉంటూ వస్తోంది. ఫిబ్రవరి 19న గాజా శాంతి బోర్డు తొలి సమావేశం జరగనుంది. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ సమావేశానికి హాజరవుతుందని అంతా ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం భారత్ తన పాత వైఖరికే కట్టుబడి ఉంది.
బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ట్రంప్ ప్రతిపాదించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని, అందుకే తొలి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జరిగే పరిణామాలను బట్టి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని భారత్ యోచిస్తోంది. ఇటీవల అరబ్ లీగ్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన భేటీలో కూడా ట్రంప్ శాంతి బోర్డు గురించి చర్చకు వచ్చింది. ఈ బోర్డులో అనేక అరబ్ దేశాలు ఉన్నప్పటికీ అవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.