HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ysrtp Chief Ys Sharmila Meets Dk Shivakumar In Karnataka

YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?

వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.

  • By Praveen Aluthuru Published Date - 02:42 PM, Mon - 29 May 23
  • daily-hunt
YS Sharmila
Whatsapp Image 2023 05 29 At 2.40.33 Pm

YS Sharmila: వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె బెంగుళూరులోని డీకే శివకుమార్ ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో డీకే కీలక పాత్ర పోషించాడని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక శివకుమార్ పాత్ర ఎంతో ఉన్నదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డీకేతో రాజకీయ చర్చలు జరిపారు. ఈ భేటీలో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేరు మారుమ్రోగింది. అధికార పార్టీని వెనక్కినెట్టి అక్కడ భారీ మెజారీటీతో గెలుపొందింది. అక్కడ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) లు ఎన్నికయ్యారు. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ చూపు తెలంగాణపై పడింది. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణాలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. గంటపాటు జరిగిన ఫోన్ సంభాషణలో తెలంగాణ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకుపడుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందామె. తాజాగా షర్మిల ప్రియాంక గాంధీతో సంభాషణ తరువాత కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య సంధి కుదిరినట్టు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు, సీఎం కెసిఆర్ ని గద్దె దెంచడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సన్నద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో శివకుమార్ షర్మిలతో ఇప్పటికే మాట్లాడినట్టు నెక్స్ట్ ఎలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో తెలంగాణాలో కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More: Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • DK Shivakumar
  • karnataka
  • Priyanka gandhi
  • telangana congress
  • telangana politics
  • ys sharmila
  • ysrtp

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Ktr

    Congress Party : కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Kadiyam Srihari

    Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd