HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ysrtp Chief Ys Sharmila Meets Dk Shivakumar In Karnataka

YS Sharmila: డీకేతో భేటీ అయిన షర్మిల.. డీల్ ఫిక్స్ అయినట్టేనా?

వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు.

  • Author : Praveen Aluthuru Date : 29-05-2023 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
Whatsapp Image 2023 05 29 At 2.40.33 Pm

YS Sharmila: వైఎస్ఆర్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఈ రోజు సోమవారం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలిశారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఎన్నికైనందుకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆమె బెంగుళూరులోని డీకే శివకుమార్ ఛాంబర్ లో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో డీకే కీలక పాత్ర పోషించాడని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక శివకుమార్ పాత్ర ఎంతో ఉన్నదని ఆమె అన్నారు. ఈ సందర్భంగా డీకేతో రాజకీయ చర్చలు జరిపారు. ఈ భేటీలో డీకే శివకుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేరు మారుమ్రోగింది. అధికార పార్టీని వెనక్కినెట్టి అక్కడ భారీ మెజారీటీతో గెలుపొందింది. అక్కడ బీజేపీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar) లు ఎన్నికయ్యారు. కర్ణాటక ఫలితాల తరువాత కాంగ్రెస్ చూపు తెలంగాణపై పడింది. తెలంగాణాలో వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్రంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో మంతనాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణాలో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది. గంటపాటు జరిగిన ఫోన్ సంభాషణలో తెలంగాణ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎప్పటికప్పుడు విమర్శలతో విరుచుకుపడుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుందామె. తాజాగా షర్మిల ప్రియాంక గాంధీతో సంభాషణ తరువాత కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీల మధ్య సంధి కుదిరినట్టు స్పష్టం అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్, వైఎస్ఆర్టీపి పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్టు, సీఎం కెసిఆర్ ని గద్దె దెంచడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సన్నద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా పావులు కదుపుతున్నారు. వైఎస్ఆర్ తో తనకున్న సాన్నిహిత్యంతో శివకుమార్ షర్మిలతో ఇప్పటికే మాట్లాడినట్టు నెక్స్ట్ ఎలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు.

తెలంగాణాలో బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎదిగింది. కెసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ పార్టీగా అవతరించింది. దీంతో తెలంగాణాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. దీంతో తెలంగాణాలో కెసిఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుంటే అధికారం చేపట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి వైఎస్ షర్మిలపై పడిందని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో షర్మిల కర్ణాటక వెళ్ళి కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్‌తో సమావేశం కావటం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read More: Delhi Jagan : చీక‌ట్లో ఆ 2గంట‌లు సీక్రెట్‌, జ‌గ‌న్ హ‌స్తిన అవ‌లోక‌నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm kcr
  • congress
  • DK Shivakumar
  • karnataka
  • Priyanka gandhi
  • telangana congress
  • telangana politics
  • ys sharmila
  • ysrtp

Related News

Kavitha Bc Bandh

కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.

  • Congress ranks call for movement in wake of National Herald case

    నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • Spying Bird

    జీపీఎస్ ట్రాకింగ్‌తో స‌ముద్ర ప‌క్షి.. చైనా ప‌నేనా?!

  • Dog Temple

    కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd