HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >What Is Slbc Tunnel Why Was Its Construction Not Completed For Two Decades

SLBC Tunnel: ఏమిటీ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ? 20 ఏళ్లుగా ఎందుకు నిర్మిస్తున్నారు ?

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 

  • Author : Pasha Date : 24-02-2025 - 8:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Slbc Tunnel Srisailam Left Bank Canal Telangana Nalgonda District

SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ సొరంగం(టన్నెల్) గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఎస్‌ఎల్‌బీసీ అంటే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ.  దీనికి సంబంధించిన సొరంగ మార్గంలో తాజాగా ప్రమాదం జరిగింది. అందులో 8 మంది చిక్కుకుపోయారు. ఇంకా రెస్క్యూ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్ఎల్‌బీసీ సొరంగం నిర్మాణానికి 42 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే నిధులు మాత్రం 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యాయి. వాటితో పనులు మొదలుపెట్టారు. గత మూడేళ్లుగా ఈ పనులు ఆగాయని, ఈ మధ్యే మళ్లీ మొదలయ్యాయని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు.  అసలు ఏమిటీ సొరంగం ? ఎందుకు తవ్వుతున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Driving License : ఇంట్లో నుంచే డ్రైవింగ్  లైసెన్స్.. షోరూం నుంచే వాహన రిజిస్ట్రేషన్

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఎందుకు ?

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్టు పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్  రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2007లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్లాన్. దీనిద్వారా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించాలని యోచించారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. అక్కడ ఓపెన్‌గా కాలువను తవ్వి పనులు చేసేందుకు అనుమతులు లభించే పరిస్థితి లేదు. అందుకే టన్నెల్స్ నిర్మించి, గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని భావించారు. 2010 నాటికే ఈ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలనేది ప్రణాళిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే  52 శాతం పనులు పూర్తయ్యాయి. గత పదేళ్లలో మరో 23 శాతం పనులు జరిగాయి.  ఇప్పటివరకు ఆరు సార్లు ఈ  ప్రాజెక్టు పూర్తికి గడువులు పెంచారు. ప్రస్తుతం 2026 జూన్‌లోగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Also Read :Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..

రెండు సొరంగాల లెక్క ఇదీ

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో భాగంగా 43.93 కిలోమీటర్ల  మేర మొదటి సొరంగాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 34.37 కిలోమీటర్ల మేర పనులు పూర్తయినట్లు తెలిసింది. ఈ టన్నెల్‌కు సంబంధించిన రెండు వైపుల నుంచి ఇన్‌లెట్(లోపలికి నీరు ప్రవేశించే భాగం), అవుట్‌లెట్ (బయటికి నీరు వెళ్లే భాగం) పనులు పూర్తి చేశారు. ఇంకా 9.56 కిలోమీటర్ల మేర ఈ  టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండో టన్నెల్‌కు సంబంధించిన 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకాల, ఉదయ సముద్రం రిజర్వాయర్ పరిధిలో ఈ రెండో టన్నెల్‌ను ఇంకా నిర్మించాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Nalgonda district
  • SLBC
  • SLBC Tunnel
  • srisailam
  • Srisailam Left Bank Canal
  • telangana

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

Latest News

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd