HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >There Is No Justice For Bcs In Telangana Says Narendra Modi

PM Modi: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగలేదు: ప్రధాని మోడీ

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారపార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా భాజపా పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు బీజేపీతోనే తీరుతాయని అన్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 26-11-2023 - 6:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PM Modi
PM Modi

PM Modi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ అధికారపార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా భాజపా పని చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు బీజేపీతోనే తీరుతాయని అన్నారు. కాంగ్రెస్‌ది సుల్తాన్‌ పాలన అయితే, బీఆర్‌ఎస్‌ది నిజాం పాలన అని విమర్శించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్రేకులు వేసిందన్నారు.

తెలంగాణలో పేదలకు ఇళ్లకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. డబుల్ ఇంజన్ తో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని మోడీ కామెంట్స్ చేశారు. అయితే వారిపై విచారణ జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కు కుటుంబం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని చెప్పారు. కారు స్టీరింగ్‌ ఎంఐఎంకు ఇచ్చారని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్నారన్నారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పారు.

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతోందని..బీఆర్‌ఎస్‌తో పదేళ్లుగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మోడీ తెలిపారు. ఆర్మూర్ పసుపుకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిందని పేర్కొన్నారు. తెలంగాణ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. నిర్మల్ బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు కళలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో ధరణి పేరుతో భూమాఫియా నడుస్తోందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై మోడీ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు.

వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందన్నారు. ముస్లింలకు కేసీఆర్ ఐటి పార్క్ హామీపై మోడీ మండిపడ్డారు. మతం పేరుతో ఐటీ పార్క్ ఏర్పాటు చేయడం దారుణమని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది నేరుగా బీఆర్‌ఎస్‌కే వెళ్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్‌ఎస్‌ పక్కన పెట్టింది. ఎస్సీ, ఓబీసీలకు కాంగ్రెస్ తీరని లోటు తెచ్చిపెట్టిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

Also Read: Violinist Sasikumar: వయోలిన్ విద్వాంసుడు శశికుమార్ మృతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • cm kcr
  • congress
  • election campaign
  • pm modi
  • telangana

Related News

Ram Mohan Naidu shared the first look of the 'Made-in-India' C-295 military aircraft.

Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భారతదేశంలో తయారైన తొలి ఎయిర్‌బస్ సి-295 విమానాన్ని ప్రదర్శించారు. స్వదేశీ రక్షణ తయారీ, ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంలో దీని పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వడోదరలో 40 విమానాలను నిర్మించనున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు ఆదివారం, భారతదేశంలో తయారైన తొ

  • Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

    El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Vikram-1 launch today; PM Modi supports Skyroot mission, describing it as a historic milestone.

    Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్‌కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd