Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి
Hyderabad: హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు
- Author : Praveen Aluthuru
Date : 17-09-2024 - 8:44 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్లో పాతబస్తీ నుంచి వెళ్లిన హిందువులు తిరిగి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్ పిలుపునిచ్చారు. చార్మినార్ లోని గణేష్ నిమజ్జన ఊరేగింపులో ప్రసంగిస్తూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిమజ్జనం రోజు బండి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బండి సంజయ్ (bandi sanjay) మాట్లాడుతూ.. హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు. అంతేకాదు ప్రజలు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఒక గంట సమయం కేటాయించాలని కోరారు. ఎలాంటి సవాళ్లు వచ్చినా, ధర్మాన్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటవుతుందని, పాతబస్తీలోని ఉగ్రవాదులు పారిపోతారని బండి సంజయ్ ప్రకటించారు.
పాతబస్తీ (old city) అభివృద్ధిపై బిజెపి దృష్టి సారిస్తుందని, మెట్రో రైలు సేవలను తీసుకువస్తామని మరియు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయడంతో పాటు అది ప్రధాన ప్రపంచ నగరాల వలె అభివృద్ధి చెందడానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. కాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు మతపరమైన విషయాలను మాట్లాడుతూనే మరోవైపు పాతబస్తీ అభివృద్ధిపై తన నిబద్ధతను తెలపడం ఆసక్తికరం.
Also Read: No Demolition : సుప్రీం ఇచ్చిన ఆదేశాలు హైడ్రాకు వర్తించవు – హైడ్రా రంగనాధ్ క్లారిటీ