HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ration Cards Issue Harish Rao Demands Reforms

Harish Rao : కొత్త రేషన్‌ కార్డుల జారీపై ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు

Harish Rao : రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Author : Kavya Krishna Date : 19-01-2025 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao : తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అర్హులైన అనేక మంది పేర్లు జాబితాలో లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆయన తన లేఖలో, రేషన్ కార్డుల అంశం పేద ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా లక్షలాది పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

హరీష్ రావు, ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సందర్భంలో ప్రభుత్వ విధానం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. సర్వేలో చెప్పిన విధానాలు ఒకటైతే, రేషన్ కార్డుల జారీ విధానం మరొకటి అని విమర్శించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుప‌డుతున్నా.. శ్రీరెడ్డి సంచ‌ల‌నం

ఈ విమర్శల నేపథ్యంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, జాబితాలో పేరు లేనివారు ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సర్వే ప్రకారం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రకటనపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని, ఇది బీఆర్ఎస్ విజయమని అన్నారు. అయితే, ప్రభుత్వంపై కీలక సూచనలు చేస్తూ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదాయ పరిమితిని సవరించాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.60,000, పట్టణ ప్రాంతాల్లో రూ.75,000గా ఉండేదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలుగా, పట్టణాల్లో రూ.2.50 లక్షలుగా పెంచామని గుర్తుచేశారు.

మాగాణి భూమికి సంబంధించిన పరిమితిని కూడా గుర్తుచేశారు. గతంలో మాగాణి భూమి పరిమితి రెండున్నర ఎకరాలు కాగా, తమ ప్రభుత్వం దీన్ని మూడున్నర ఎకరాలకు పెంచిందని, మెట్ట భూమికి సంబంధించిన పరిమితిని ఐదు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలుగా పెంచారని తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా లక్షలాది నిరుపేదలు రేషన్ కార్డులకు అర్హత సాధించారని చెప్పారు.

హరీష్ రావు, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పరిమితి పెంపుతో పాటు నిబంధనల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అల్పాదాయ వర్గాలకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Fact Check : చెక్కులను నింపడానికి బ్లాక్ ఇంక్ వినియోగంపై బ్యాన్.. నిజమేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Civil Supplies
  • harish rao
  • Income Limits
  • inflation
  • ration cards
  • rural development
  • telangana
  • telangana government
  • welfare schemes

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Rbi Loans

    War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

Latest News

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd