HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ration Cards Issue Harish Rao Demands Reforms

Harish Rao : కొత్త రేషన్‌ కార్డుల జారీపై ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు

Harish Rao : రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

  • Author : Kavya Krishna Date : 19-01-2025 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao : తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అర్హులైన అనేక మంది పేర్లు జాబితాలో లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆయన తన లేఖలో, రేషన్ కార్డుల అంశం పేద ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా లక్షలాది పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

హరీష్ రావు, ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సందర్భంలో ప్రభుత్వ విధానం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. సర్వేలో చెప్పిన విధానాలు ఒకటైతే, రేషన్ కార్డుల జారీ విధానం మరొకటి అని విమర్శించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుప‌డుతున్నా.. శ్రీరెడ్డి సంచ‌ల‌నం

ఈ విమర్శల నేపథ్యంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, జాబితాలో పేరు లేనివారు ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సర్వే ప్రకారం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ప్రకటనపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని, ఇది బీఆర్ఎస్ విజయమని అన్నారు. అయితే, ప్రభుత్వంపై కీలక సూచనలు చేస్తూ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదాయ పరిమితిని సవరించాలని డిమాండ్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.60,000, పట్టణ ప్రాంతాల్లో రూ.75,000గా ఉండేదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలుగా, పట్టణాల్లో రూ.2.50 లక్షలుగా పెంచామని గుర్తుచేశారు.

మాగాణి భూమికి సంబంధించిన పరిమితిని కూడా గుర్తుచేశారు. గతంలో మాగాణి భూమి పరిమితి రెండున్నర ఎకరాలు కాగా, తమ ప్రభుత్వం దీన్ని మూడున్నర ఎకరాలకు పెంచిందని, మెట్ట భూమికి సంబంధించిన పరిమితిని ఐదు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలుగా పెంచారని తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా లక్షలాది నిరుపేదలు రేషన్ కార్డులకు అర్హత సాధించారని చెప్పారు.

హరీష్ రావు, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పరిమితి పెంపుతో పాటు నిబంధనల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అల్పాదాయ వర్గాలకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Fact Check : చెక్కులను నింపడానికి బ్లాక్ ఇంక్ వినియోగంపై బ్యాన్.. నిజమేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Civil Supplies
  • harish rao
  • Income Limits
  • inflation
  • ration cards
  • rural development
  • telangana
  • telangana government
  • welfare schemes

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • A New Look for the Kaleswaram Temple

    Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd