Telangana Government
-
#Telangana
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 24-02-2026 - 8:56 IST -
#Telangana
తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్..
Telangana Government తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్. త్వరలోనే గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లుకు చట్టబద్ధత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్దత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది. బిల్లుకు చట్టబద్ధత వస్తే.. ప్రత్యేక బోర్డు ద్వారా గిగ్ కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్లు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ప్రసూతి సహాయం వంటివి అందనున్నాయి. తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్న్యూస్ సంక్షేమ బిల్లుకు త్వరలో చట్టబద్ధత ప్రత్యేక బోర్డు ద్వారా కార్మికులకు సాయం తెలంగాణలోని […]
Date : 21-02-2026 - 9:55 IST -
#Telangana
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ విభజన
GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు […]
Date : 11-02-2026 - 12:08 IST -
#Telangana
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు
Date : 11-02-2026 - 12:00 IST -
#Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..
Telangana Farmers తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ […]
Date : 29-01-2026 - 3:28 IST -
#Telangana
మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు
మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Date : 29-01-2026 - 10:45 IST -
#Speed News
బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
Telangana Government నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప్రెస్ లోగోలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి నిబంధనలు ఉల్లంఘిస్తే […]
Date : 26-01-2026 - 2:44 IST -
#Speed News
పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Bhukya Gowthami పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా […]
Date : 26-01-2026 - 10:59 IST -
#Speed News
వాహనదారులకు గుడ్ న్యూస్.. షోరూమ్లోనే రిజిస్ట్రేషన్.. తెలంగాణలో నేటి నుంచే
Telangana Transport Department తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై వాహనం కొనుగోలు చేసిన డీలర్ పాయింట్ వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తిచేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు వాహనదారులకు వేగంగా సేవలు అందనున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లకు […]
Date : 24-01-2026 - 11:19 IST -
#Telangana
మహిళలల ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్
మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం 'ఇందిరా డెయిరీ ప్రాజెక్టు'ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం (D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది
Date : 02-01-2026 - 11:15 IST -
#Telangana
న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
డిసెంబర్ నెలకు సంబంధించిన బకాయిల కోసం రూ.713 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రతి నెలా సగటున రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం కొనసాగిస్తోంది.
Date : 01-01-2026 - 6:00 IST -
#Telangana
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జనవరి నెలలో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం […]
Date : 30-12-2025 - 2:22 IST -
#Telangana
సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం
Date : 23-12-2025 - 11:10 IST -
#Telangana
రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!
Telangana Government : తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడనుంది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పింఛనుదారులకు గుడ్న్యూస్ ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛన్లు అమలుల్లోకి..! ‘చేయూత’ గ్యారంటీపై ప్రభుత్వం ఫోకస్ తెలంగాణలో అధికారంలో […]
Date : 16-12-2025 - 11:01 IST -
#Speed News
TGSRTCలో భారీగా కండక్టర్ ఉద్యోగ ఖాళీలు…నియామకాలకు రెడీ
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దశాబ్ద కాలంగా నియామకాలు లేకపోవడంతో 2,059 మంది కండక్టర్ల కొరత ఏర్పడింది. కొత్త బస్సులొచ్చినా.. డ్రైవర్లపైనే కండక్టర్ల బాధ్యతలు, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా 11 ఏళ్లలో 18,025 తగ్గింది. తక్షణమే 1500 కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా కండక్టర్ల పోస్టుల్లో […]
Date : 25-11-2025 - 10:05 IST