Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- Author : Praveen Aluthuru
Date : 06-01-2024 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉన్నతాధికారులతో సమీక్షించారు.దాదాపు 40 శాతం మంది రైతులకు రైతుబంధు పూర్తయిందని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా వరి, ఇతర యాసంగి పంటల నాట్లు పనులు కొనసాగుతున్నాయని, రైతుబంధు విడుదలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారుల్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.ప్రతి రోజు విడుదలలు జరిగేలా చూడాలని, వచ్చే సోమవారం నుంచి అధిక సంఖ్యలో రైతులకు బీమా కల్పించాలని ఆయన ఆదేశించారు. సంక్రాంతి తర్వాత వెంటనే తదుపరి సమీక్ష నిర్వహిస్తామని తుమ్మల పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. వారసత్వంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ, రైతు బంధు మొత్తాలను రైతులందరికీ సక్రమంగా మరియు సమయానుకూలంగా విడుదల చేసేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం నిబద్ధతపై రైతులకు, ప్రజలకు ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలిపారు. కాగా ప్రభుత్వం డిసెంబర్ 11 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించింది.
రైతు బంధు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్ప్రవేశపెట్టింది. అయితే గత ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా నవంబర్ చివరిలో వేయాల్సిన రైతు బంధు పంపిణీని భారత ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల్లో రైతు భరోసా ఒకటి. ఏటా ఎకరాకు రూ 15,000 ఆర్థిక సహాయం చేస్తామని, రైతు బంధు కింద రైతులు పొందుతున్న దాని నుంచి రూ.5,000 పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కౌలు రైతులు రైతుబంధు పరిధిలోకి రానందున, వారికి రైతు భరోసా కింద వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వ్యవసాయ కూలీలకు ఒక్కొక్కరికి రూ.12,000 వార్షిక ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Also Read: Usiri Pulihora: ఉసిరి పులిహోర.. ఆ టేస్టే సూపర్.. తింటే అస్సలు వదలరంతే..