Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం.
- By Praveen Aluthuru Published Date - 02:53 PM, Thu - 29 February 24
![Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/telanagana-bjp-winners-1701862991.jpg)
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో బీజేపీ తన సంఖ్యను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. బిజెపి అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించనప్పటికీ, నలుగురు సిట్టింగ్ ఎంపీలలో ముగ్గురు వారి స్థానాల నుండి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు.
చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీ ఖరారు చేయగా, ప్రతిష్టాత్మకమైన మల్కాజిగిరి స్థానానికి భారీ పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్తోపాటు విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవి లత పేరు ప్రచారంలో ఉంది. ఆమె ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మెదక్: గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు మెదక్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సంగారెడ్డి పార్టీ అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డికి కూడా అక్కడ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉంది.
భువనగిరి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న బూర నర్సయ్యగౌడ్ భువనగిరి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ సీటు కోసం వెదిరె శ్రీరామ్, మనోహర్రెడ్డి వంటి ఇతర అభ్యర్థులు ఉన్నారు.
మహబూబ్నగర్ : ఈ సీటు కోసం డీకే అరుణ, జితేందర్రెడ్డిల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతి కుమార్ కూడా ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.
జహీరాబాద్ : టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు బీజేపీ టిక్కెట్టు ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్లు ఆయన్ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రస్తుత బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరితే ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ నుంచి వైదొలగడంతో ఆయన త్వరలో బీజేపీలో చేరి, ఆయనకు లేదా ఆయన కుమారుడికి ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని భావిస్తున్నారు. మహిళా నేత బంగారు శృతి (బంగారు లక్ష్మణ్ కూతురు)కి కూడా బీజేపీ టిక్కెట్టు ఇచ్చే అవకాశం ఉంది.
నల్గొండ : నియోజకవర్గం నుంచి బలమైన పోటీదారు ఎవరూ లేరు. పార్టీకి ఎప్పటి నుంచో బలహీనమైన సెగ్మెంట్. ఈ సీటుకు గార్లపాటి జితేంద్ర కుమార్, సైదిరెడ్డి, రాజారాం యాదవ్, చిన్నప్ప రెడ్డిలు పోటీ చేస్తున్నారు.
ఖమ్మం : ఈ నియోజకవర్గం టిక్కెట్టు పారిశ్రామికవేత్త తాండ్ర వినోద్కు లేదా నియోజకవర్గంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లుకు దక్కవచ్చు.
మహబూబాబాద్ : ఇక్కడ కూడా పార్టీ నుండి బలమైన పోటీదారులు లేరు, అయితే టిక్కెట్ జాటోతు హుస్సేన్ నాయక్ లేదా కృష్ణవేణి నాయక్కు దక్కుతుంది.
వరంగల్ : ఇక్కడ కూడా బలమైన పోటీదారు లేకపోయినా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ లేదా సుభాష్కు టికెట్ ఇవ్వవచ్చు.
పెద్దపల్లి : గాయకుడు మిట్టపల్లి సురేందర్తోపాటు సీనియర్ నేత ఎస్కుమార్ పోటీలో ఉన్నారు.
Also Read: Sanjay Raut : నూతన పార్లమెంట్ భవనంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/KTR-2-1.jpg)
KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు
ప్రశ్నలు, జవాబులు, పంచ్లు.. ప్రాసలతో సభ అంతా రసవత్తరంగా సాగింది. అయితే ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR Comments) ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.