HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Ap Cms Will Meet Tomorrow At Pragathi Bhavan

Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముహూర్తం ఖ‌రారు.. వేదిక‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిని విష‌యం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే.

  • Author : Gopichand Date : 05-07-2024 - 4:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana- AP CMs
Telangana- AP CMs

Telangana- AP CMs: తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారిని విష‌యం ఏదైనా ఉందంటే.. అది ఏపీ సీఎం చంద్ర‌బాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల (Telangana- AP CMs) భేటీనే. గ‌త కొన్ని రోజులుగా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది ఈ టాపిక్‌. ఇరు రాష్ట్రాల సీఎంలు తొలిసారి భేటీకి రావ‌డంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే జూలై 6వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశానికి ముహూర్తం ఖ‌రారైంది. తెలంగాణ‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ ఇరు రాష్ట్రాల సీఎంల స‌మావేశానికి వేదిక కానుంది. ఇప్పటికే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ మంత్రులు. అయితే ఈ భేటీ త‌ర్వాత చాలా విష‌యాల‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు.

అయితే ఉమ్మ‌డి ఏపీ విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావటం ఇదే మొదటిసారి కావ‌డం విశేషం. ఈ స‌మావేశంలో ప్రధానంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం.. తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ.. రూ.7 వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

Also Read: Sabitha Indra Reddy: బీఆర్‌ఎస్‌లోనే సబితా, క్లారిటీ వచ్చేసింది

కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైన విష‌యం తెలిసిందే. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి పడిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.

షెడ్యూల్‌ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. అయితే వీట‌న్నింటికి రేపు సీఎం చంద్ర‌బాబు, రేవంత్‌ల స‌మావేశం త‌ర్వాత ఓ కొలిక్కి వ‌స్తాయ‌ని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ వ‌ర్గాల్లోనూ.. అటు కూట‌మి ప్ర‌భుత్వంలోనూ సీఎంల స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • CM Revanth Reddy
  • hyderabad
  • politics
  • pragathi bhavan
  • Revanth- Chandrababu Meeting
  • telugu states

Related News

Uttam Kumar Reddy

రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.

  • There should be a system where money is automatically deducted if a challan is issued: CM Revanth Reddy

    చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Maalyada The Sacred Garlan

    జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

  • Massive arrangements for Sankranti rush.. Special trains between Cherlapalli-Anakapalli

    సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు

  • కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

  • భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

  • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

Trending News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd