HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Stones Pelted At Secunderabad Visakhapatnam Vande Bharat Train

Vande Bharat Train: తెలంగాణలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రంగంలోకి రైల్వే అధికారులు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

  • Author : Gopichand Date : 11-02-2023 - 6:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Vande Bharat Exp

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్‌ రైలు (Vande Bharat Train)పై శుక్రవారం రాళ్ల దాడి జరిగింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మీదుగా వెళ్తున్న సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ రైలు కోచ్‌పై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు సమాచారం అందించారు. రాళ్ల దాడి ఘటనను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో రైలుపై చిన్నారులు రాళ్లు రువ్వి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

రైల్వే పోలీసులు స్వయంగా కేసు నమోదు చేశారు. మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై జరిగిన ఈ దాడిలో ఓ బోగీ అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గత నెలలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ముందు విశాఖపట్నంలోని రైల్వే యార్డు వద్ద రైలు కోచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో రైలు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Also Read: Lakshmi Devi: పర్సులో ఇవి ఉంచుకుంటే చాలు.. లక్ష్మి మీ వెంటే?

ఇటీవల మరోసారి ఖమ్మం జిల్లాలో రాళ్ల దాడి జరగ్గా ఎమర్జెన్సీ విండో దెబ్బతింది. దాంతో రైలు మూడు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా తెలంగాణలోని సికింద్రాబాద్- ఆంధ్రప్రదేశ్‌ మధ్య వందేభారత్ రైలు సర్వీసును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Secunderabad-Visakhapatnam
  • Stones Pelted
  • telangana
  • vande bharat train

Related News

Telangana government good news for Anganwadi helpers

Anganwadi Jobs : అంగన్వాడీల్లో 7,000 పోస్టులు భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంధ్యా రాణి ఈ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7,000 ఆయా (అంగన్వాడీ హెల్పర్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు

  • Telangana government once again focuses on BC reservations

    బీసీల రిజర్వేషన్ల పై మరోసారి దృష్టి .. ఏదో ఒకటి తేలాకే పరిషత్ ఎన్నికలు .. !

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • SBI Life opens three new branches in Telangana

    తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

Latest News

  • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

  • SBI Jobs : SBIలో జాబ్స్.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్

  • యూట్యూబ‌ర్ అన్వేష్‌కు బిగ్ షాక్‌!

  • Vijay- Rashmika Assets : వామ్మో.. విజయ్ దేవరకొండ ఆస్తులతో సమానంగా రష్మిక ఆస్తులు ! గట్టిగానే సంపాదించింది !!

Trending News

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    • టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!

    • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd