PM Narendra Modi: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది.
- By Gopichand Published Date - 07:50 AM, Sun - 8 January 23
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది. దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన ఈ రైలును హైదరాబాద్-విశాఖపట్నం లేదా హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో నడుపుతారు. ఇదిలా ఉండగా.. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో మోదీ ప్రసంగం జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది.
అయితే గతేడాది దీపావళి తర్వాత తెలంగాణలో వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది కుదరలేదు. ఇప్పుడు ఎట్టకేలకు సంక్రాంతి తర్వాత రాష్ట్రానికి వందే భారత్ రైలు రాబోతోంది. దేశంలో ఇప్పటి వరకు ఏడు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కేంద్రం ప్రారంభించగా, ఇది ఎనిమిదోది. ఇప్పటివరకు ప్రారంభమైన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. తెలంగాణలో కూడా ప్రారంభిస్తారు. కాగా.. ఆగస్టు 15 నాటికి 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని వివిధ మార్గాల్లో మొత్తం 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Shoots Rapist’s Mother: దారుణ ఘటన.. అత్యాచారం చేశాడని బాలుడి తల్లిపై కాల్పులు
మరోవైపు త్వరలో ఈ వందేభారత్ రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఢిల్లీ సిటీతో పాటు సికింద్రాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైళ్లకు డిమాండ్ ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లు సిద్ధమైన తర్వాత రైల్వే బోర్డు వాటిని జోన్ల వారీగా కేటాయిస్తుంది.
వందే భారత్ రైళ్ల ప్రత్యేకతలు
సున్నా నుండి 100 కి.మీ కేవలం 40 సెకన్లలోనే వేగాన్ని అందుకోవడం ఈ రైళ్ల ప్రత్యేకత. ఇవి గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. రెండవ తరం వందే భారత్ రైళ్లు గంటకు 200 కి.మీ. వేగాన్ని ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఈ రైళ్లు దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడుస్తాయి. ఈ రైళ్లను సిట్టింగ్తో పాటు స్లీపర్ కోచ్లతో రూపొందించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కు ఈ తరహా రైళ్లు అవసరమని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో ఈ రైళ్లకు మెట్రో తరహాలో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించే ప్రతిపాదన ఉంది. కానీ, చాలా ఖర్చు అవుతుంది.
ఈ రైళ్లు మెట్రోను మించిన అనుభూతిని కలిగి ఉంటాయి. ఏసీ రైలులో దాదాపు 16 బోగీలు ఉండగా.. ప్రతి బోగీలో వైఫై సౌకర్యం ఉంటుంది. ప్రయాణీకులు ఎక్కినప్పుడు, దిగినప్పుడు స్వయంచాలకంగా తెరుచుకునే తలుపులు, కావలసిన దిశలో తిప్పగలిగే సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద అద్దాలతో కూడిన కిటికీలు, విమానాల వంటి బయో-టాయిలెట్లు ఈ రైళ్లలో అదనపు ఫీచర్లు ఉంటాయి. వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
Related News
Prashant Kishor: వైఎస్ విజయమ్మ కూడా డబ్బుల తీసుకొని జగన్ను విమర్శించారా..?
తాను టీడీపీకి అమ్ముడుపోయానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు.