HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponguleti Key Announcement On Indirammas Houses

Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్ల‌పై మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌!

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • By Gopichand Published Date - 11:31 PM, Wed - 11 December 24
  • daily-hunt
Minister Ponguleti
Minister Ponguleti

Minister Ponguleti: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, గ్రూప్ -2 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, మెస్ ఛార్జీల‌పెంపు, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌రిశీల‌న‌ను ఈనెల 31వ‌తేదీలోగా పూర్తిచేయాలి. ప‌రిశీల‌న చేసిన స‌ర్వే వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి. ప్రతి ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయ‌ర్‌)ను నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగ‌స్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. అంతేగాక‌ స్థానిక పరిస్థితులను బట్టి క‌లెక్ట‌ర్‌లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఏ ఒక్క దరఖాస్తును విడిచిపెట్ట‌కుండా చిన్న చిన్న పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పకడ్బందీగా సర్వే నిర్వహించాలి. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంత‌ర ప్ర‌క్రియ ఈ ఏడాది 4.5 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మించ‌బోతున్నామ‌ని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

Also Read: 37th Hyderabad Book Fair : పుస్తక ప్రియులు ఎదురుచూసే సమయం రానేవచ్చింది

గ‌త ప్ర‌భుత్వం ప‌ది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల‌లో చ‌దువుకొనే విద్యార్ధుల మెస్ ఛార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేదు. త‌మ‌ ప్ర‌భుత్వం ఏడాదిలోపే 40 శాతం మెస్ ఛార్జీలు పెంచుతూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల 7.65 ల‌క్ష‌ల మంది విద్యార్దుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగింది. క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ హాస్టళ్ల‌ను త‌నిఖీ చేసి విద్యార్ధుల‌కు అందించే స‌రుకుల క్వాలిటీ, క్వాంటిటీపై ప్ర‌ధానంగా దృష్టి సారించాలి. ఈనెల 14వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్ల‌మెంటు స‌భ్యులు స్థానికంగా ఉన్న సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను సంద‌ర్శించి అక్క‌డే విద్యార్ధుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్ధుల త‌ల్లిదండ్రులు కూడా పాల్గొనాలని తెలిపారు.

సామాజిక స‌ర్వే

రాష్ట్రంలో 1 కోటి 16 ల‌క్ష‌ల కుటుంబాల‌కు గాను 1 కోటి 12 ల‌క్ష‌ల కుటుంబాల సామాజిక స‌ర్వే (99.09 శాతం) పూర్తి చేయ‌డం జ‌రిగింది. ఇందుకు కృషి చేసిన అధికారుల‌కు ముఖ్య‌మంత్రి త‌ర‌పున‌, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ప్ర‌త్యేక అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈనెల 13వ తేదీ సామాజిక స‌ర్వేకు తుది గ‌డువు. ఆ త‌ర్వాత ప్ర‌జా పాల‌న సేవా కేంద్రాల‌లో కూడా కుటుంబ స‌ర్వే వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగే గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • hyderabad
  • Indiramma Houses
  • Minister Ponguleti
  • Ponguleti Good News
  • telangana
  • telangana politics
  • telugu news

Related News

Minister Lokesh

Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్‌

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

  • Gold Price Aug20

    Gold Price : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

  • Sadar Kishanreddy

    Sadar Celebrations : సదర్ ఉత్సవాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి

  • Sadar Sammelan

    Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

  • Minister Lokesh

    Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

Latest News

  • Air Pollution : ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

  • CBN Visit Abroad : నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్

  • Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Trending News

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd