KTR vs Rahul: మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ
ఖమ్మం జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ అగ్ర నేతలు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చురకలంటించారు.
- By Praveen Aluthuru Published Date - 11:47 AM, Mon - 3 July 23
KTR vs Rahul: ఖమ్మం జనగర్జన సభ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై అధికార పార్టీ అగ్ర నేతలు ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అవినీతి ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా చురకలంటించారు. బీఆర్ఎస్ బీజేపీ బంధువుల పార్టీ అన్న రాహుల్ కామెంట్స్ పై కేటీఆర్ మాట్లాడుతూ…మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు..మీదే భారత రాబందుల పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ఏఐసీసీ అంటేనే…అఖిల భారత కరప్షన్ కమిటీగా అభివర్ణించారు. దేశంలో అవినీతికి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అన్నారు. స్కాములే తాచుపాములై.. మీ యూపీఏను.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మరిచిపోలేదన్నారు.
మా పార్టీ బీజేపీకి బీ టీమ్ కాదని, కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ అంతకన్నా కాదని స్పష్టం చేశారు. బీజేపీ-కాంగ్రెస్ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ టీమ్ మా బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికీ కుప్పకూలేది కాంగ్రెస్సేనంటూ విమర్శించారు. రాహుల్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్లు వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఘాటుగా ప్రశ్నించారు. అర్థంలేని ఆరోపణలు చేసి..ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారన్నారు.
తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షమని, అయితే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదని చురకలంటించారు. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యం తెస్తామన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని స్పష్టం చేశారు. కర్ణాటకలో “అన్నభాగ్య” హామీని గంగలో కలిపిన కాంగ్రెస్ తెలంగాణాలో 4 వేల పెన్షన్ అంటే నమ్మేదెవరని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరు?. కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదని చెప్పారు. మరో ప్రత్యామ్నాయం లేకే ఆ ఫలితం తప్ప అది మీ ఘనత కాదు – సమర్థత అంతకన్నా కాదని రాహుల్ పై మండిపడ్డారు.
సమ్మక్క జాతరను తలపించేలా పండుగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా..? కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 4.6 లక్షల ఎకరాలు పంచి అడవిబిడ్డల జీవితాల్లో ఆనందాన్ని నింపిన మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అని చెప్పారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమ నినాదాలనే కాదు, జల్ జంగల్ జమీన్ అనే మన్యంవీరుడు కొమరం భీం కలలను కూడా సంపూర్ణంగా సాకారం చేసిన దార్శనిక ముఖ్యమంత్రి కేసిఆర్ గారని చెప్పారు. మీ పాలనలో మంచం పట్టిన మన్యం వార్తలు, మా పాలనలో మన్యానికి మంచిరోజులన్నారు.
తెలంగాణలో నిరంతరం పేదల పక్షాన నిలిచిన పార్టీ మాది. బ్రోకర్లు, కబ్జాకోరుల పక్షాన ఎప్పుడూ నిలబడే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కారు స్టీరింగ్ కేసిఆర్ గారి చేతిలో పదిలంగా ఉంటుంది కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పిందని ఎద్దేవా చేశారు. మా తొమ్మిదేళ్ల పాలన వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన చీకటి అధ్యాయం. కుమ్ములాటల కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ కల్లోలం అని చెప్పారు కేటీఆర్.
Read More: Drones: వాహనదారులపై డ్రోన్ నిఘా, హద్దు మీరితే చలాన్ కట్టాల్సిందే!
Tags
Related News
Narendra Modi : ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రసన్నం చేసుకునేందుకు.. టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి
రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘాలపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి మండిపడ్డారు.