Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మద్యం కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపై కీలక..
- By Prasad Published Date - 07:17 AM, Thu - 1 December 22
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మద్యం కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపై కీలక విషయాలను వెలుగులోకి తీసుకువస్తుంది.
తాజాగా ఈ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుని వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడు, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా ఈ కుంభకోణానికి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు.
అంతేకాకుండా, 32 పేజీల నివేదికలో కవిత పేరును పేర్కొనడంతోపాటు, ఆమె పది మొబైల్ ఫోన్లు మార్చినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం.. ఆప్ నాయకుల తరపున ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్ సౌత్ కార్టెల్ గ్రూప్ నుండి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారని.. సౌత్ కార్టెల్ గ్రూప్ను కవిత, అరబిందో ఫార్మాకు చెందిన శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రిస్తున్నారని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అంతేకాకుండా, 2021 మరియు 2022లో కవిత తన మొబైల్ ఫోన్ను ఆరుసార్లు మార్చారని నివేదిక పేర్కొంది. డిజిటల్ సాక్ష్యాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారని ED ఆరోపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఎమ్మెల్సీ ఇటీవలి కాలంలో ఖండించారు.
Tags
Related News
Amit Shah: తెలంగాణపై బీజేపీ దృష్టి.. నేడు సిద్దిపేటకు అమిత్ షా
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తొలి బహిరంగ సభకు సిద్దిపేట వేదికైంది.